Switch to English

ఇప్పుడు కావాల్సింది భయమే.. అది కూడా టన్నుల్లో..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 30.66 లక్షల మందికి పాజిటివ్ రాగా, 2.11 లక్షల మంది మృత్యువాతపడ్డారు. ఈ వైరస్ తీవ్రత ఏమిటో ఈ గణాంకాలు చూస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం దీనిని చిన్నపాటి జ్వరమని మరోసారి తేల్చేశారు. దీనికి ఎవరూ భయపడొద్దని.. కరోనా వచ్చినవారిని చిన్నచూపు చూడొద్దని, ఇంట్లో ఉంటూనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు. కరోనా ఇప్పట్లో పోయేది కాదని, దానితో కలిసి జీవించక తప్పని పరిస్థితులు ఉంటాయని వ్యాఖ్యానించారు.

దీనిపై టీడీపీ నేతలు మండిపడ్డారు. పాలకులు చేతులెత్తేశారని, వారి మాటల్లోని డొల్లతనం చూస్తుంటే ఇక ఏపీని ఆ దేవుడే కాపాడాలని చంద్రబాబు పేర్కొన్నారు. దీంతో వైసీపీ నేతలు కౌంటరిచ్చారు. పాజిటివ్ ఉన్న వ్యక్తుల్లో ధైర్యం, నైతికస్థైర్యం నింపేందుకే జగన్ అలా చెబుతున్నారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా వస్తే చనిపోవడం ఖాయమని, ప్రపంచం అంతమైపోతుందని భయపెట్టాలా అని ప్రశ్నించారు.

నిజానికి జగన్ చెప్పినదాంట్లో కొంత వాస్తవం ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది సరికాదు. కరోనా వైరస్ పట్ల ప్రస్తుతం జనానికి కావాల్సింది భయమే. అది కూడా మామూలుగా కాదు.. టన్నులు టన్నుల్లో ఉండాలి. అప్పుడే ప్రభుత్వాలు ఎన్నో వ్యవప్రయాసలకోర్చి, పలువురిని పస్తులుంచి విధించిన లాక్ డౌన్ సక్రమంగా అమలవుతుంది. ప్రచార కాంక్షతో కొందరు నేతలు చేస్తున్న స్టంట్లు మొదటికే మోసం తెస్తున్నాయి. జనాలకు వైరస్ పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్లో, ఇది చిన్నపాటి జ్వరమేనన్న జగన్ మాటలు వినో పెద్దగా పట్టించుకోకుండా నేతల పబ్లిసిటీ స్టంట్లలో భాగస్వాములై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

అలాకాకుండా ఈ వైరస్ సోకితే ప్రాణాలకు ముప్పు ఉంటుందని, మీకు వస్తే మీ కుటుంబ సభ్యులకూ సోకే ప్రమాదం ఉంటుందని, అందువల్ల జాగ్రత్తలు తీసుకోవాలని గట్టిగా చెబితే కొంతవరకు అయినా వారు జాగ్రత్తగా ఉండే వీలుంటుంది. అప్పుడే లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా ఇంటికే పరిమితమవుతారు. ఎప్పుడైతే ఇది చిన్నపాటి జ్వరమని సాక్షాత్తు సీఎం చెప్పడంతో పార్టీ నేతలతోపాటు జనాలు కూడా లైట్ తీసుకుంటున్నారు. ఫలితంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విషయంలో కరెక్టుగా వ్యవహరించారు. రాష్ట్రం మొత్తం నాలుగు రోజులు ఎక్కువే లాక్ డౌన్ విధించారు. అంతేకాక కేంద్రం కల్పించిన వెసులుబాట్లు కూడా ఇవ్వలేదు. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చని, ముందు జనాలు ప్రాణాలతో ఉండటం ముఖ్యమని చెప్పిన విషయం ఇక్కడి ప్రజలకు బాగా అర్థమైంది. అందుకే పల్లెల్లో లాక్ డౌన్ నూటికి నూరు శాతం పక్కాగా అమలవుతోంది. పట్టణాల్లో ఉల్లంఘనలు ఉండటంలో ప్రస్తుతం అక్కడే కేసులు నమోదవుతున్నాయి. దీనిని బట్టి చూస్తే వైరస్ విషయంలో ప్రజలకు భరోసాతోపాటు భయం కూడా కల్పించాలి. అప్పుడే వారితోపాటు వైరస్ కూడా దారికి వస్తుంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎక్కువ చదివినవి

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...