ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 30.66 లక్షల మందికి పాజిటివ్ రాగా, 2.11 లక్షల మంది మృత్యువాతపడ్డారు. ఈ వైరస్ తీవ్రత ఏమిటో ఈ గణాంకాలు చూస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం దీనిని చిన్నపాటి జ్వరమని మరోసారి తేల్చేశారు. దీనికి ఎవరూ భయపడొద్దని.. కరోనా వచ్చినవారిని చిన్నచూపు చూడొద్దని, ఇంట్లో ఉంటూనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు. కరోనా ఇప్పట్లో పోయేది కాదని, దానితో కలిసి జీవించక తప్పని పరిస్థితులు ఉంటాయని వ్యాఖ్యానించారు.
దీనిపై టీడీపీ నేతలు మండిపడ్డారు. పాలకులు చేతులెత్తేశారని, వారి మాటల్లోని డొల్లతనం చూస్తుంటే ఇక ఏపీని ఆ దేవుడే కాపాడాలని చంద్రబాబు పేర్కొన్నారు. దీంతో వైసీపీ నేతలు కౌంటరిచ్చారు. పాజిటివ్ ఉన్న వ్యక్తుల్లో ధైర్యం, నైతికస్థైర్యం నింపేందుకే జగన్ అలా చెబుతున్నారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా వస్తే చనిపోవడం ఖాయమని, ప్రపంచం అంతమైపోతుందని భయపెట్టాలా అని ప్రశ్నించారు.
నిజానికి జగన్ చెప్పినదాంట్లో కొంత వాస్తవం ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది సరికాదు. కరోనా వైరస్ పట్ల ప్రస్తుతం జనానికి కావాల్సింది భయమే. అది కూడా మామూలుగా కాదు.. టన్నులు టన్నుల్లో ఉండాలి. అప్పుడే ప్రభుత్వాలు ఎన్నో వ్యవప్రయాసలకోర్చి, పలువురిని పస్తులుంచి విధించిన లాక్ డౌన్ సక్రమంగా అమలవుతుంది. ప్రచార కాంక్షతో కొందరు నేతలు చేస్తున్న స్టంట్లు మొదటికే మోసం తెస్తున్నాయి. జనాలకు వైరస్ పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్లో, ఇది చిన్నపాటి జ్వరమేనన్న జగన్ మాటలు వినో పెద్దగా పట్టించుకోకుండా నేతల పబ్లిసిటీ స్టంట్లలో భాగస్వాములై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
అలాకాకుండా ఈ వైరస్ సోకితే ప్రాణాలకు ముప్పు ఉంటుందని, మీకు వస్తే మీ కుటుంబ సభ్యులకూ సోకే ప్రమాదం ఉంటుందని, అందువల్ల జాగ్రత్తలు తీసుకోవాలని గట్టిగా చెబితే కొంతవరకు అయినా వారు జాగ్రత్తగా ఉండే వీలుంటుంది. అప్పుడే లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా ఇంటికే పరిమితమవుతారు. ఎప్పుడైతే ఇది చిన్నపాటి జ్వరమని సాక్షాత్తు సీఎం చెప్పడంతో పార్టీ నేతలతోపాటు జనాలు కూడా లైట్ తీసుకుంటున్నారు. ఫలితంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విషయంలో కరెక్టుగా వ్యవహరించారు. రాష్ట్రం మొత్తం నాలుగు రోజులు ఎక్కువే లాక్ డౌన్ విధించారు. అంతేకాక కేంద్రం కల్పించిన వెసులుబాట్లు కూడా ఇవ్వలేదు. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చని, ముందు జనాలు ప్రాణాలతో ఉండటం ముఖ్యమని చెప్పిన విషయం ఇక్కడి ప్రజలకు బాగా అర్థమైంది. అందుకే పల్లెల్లో లాక్ డౌన్ నూటికి నూరు శాతం పక్కాగా అమలవుతోంది. పట్టణాల్లో ఉల్లంఘనలు ఉండటంలో ప్రస్తుతం అక్కడే కేసులు నమోదవుతున్నాయి. దీనిని బట్టి చూస్తే వైరస్ విషయంలో ప్రజలకు భరోసాతోపాటు భయం కూడా కల్పించాలి. అప్పుడే వారితోపాటు వైరస్ కూడా దారికి వస్తుంది.
337121 65189But wanna comment that you have a very nice internet internet site , I adore the style and style it actually stands out. 449005
456215 932351Some genuinely intriguing data, well written and broadly user pleasant. 528217
640367 484974Extremely informative and wonderful complex body part of articles , now thats user pleasant (:. 551950
650144 675754Nice blog right here! Additionally your website a lot up very fast! 567915
284717 4049Hi, you used to write superb posts, but the last several posts have been kinda boring I miss your great posts. Past couple of posts are just a little bit out of track! 862625