డ్రగ్స్ కేసు విచారణ ఈడీ ఆఫీసులో జరిగింది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాద్ మరియు బండ్ల గణేష్ లు హాజరు అయ్యారు. పూరికి తోడుగా మాత్రమే నేను ఈడీ ఆపీస్ కు వచ్చాను తప్ప నాకు ఏమీ నోటీసులు రాలేదు అంటూ చెప్పాడు. ఇక పూరిని పలు విషయాలపై ఈడీ పదే పదే గుచ్చి గుచ్చి అడిగిందట. ఆఫ్రికా నుండి పూరికి డ్రగ్స్ సరఫరా అయినట్లుగా అనుమానాలను ఈడీ వ్యక్తం చేస్తుంది. అందుకు కారణం ఆఫ్రికాకు పూరి పలు సందర్బాల్లో డబ్బును పెద్ద మొత్తంలో పంపించినట్లుగా లావాదేవీలు ఉన్నాయి.
పూరి అకౌంట్ నుండి స్వయంగా ఆఫ్రికాకు వెళ్లడం వల్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ డబ్బు ఎందుకు అక్కడకు పంపించారు. అక్కడ నుండి మీ వద్దకు వచ్చినవి ఏంటీ అంటూ ఈడీ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ సరఫరా విషయంలో కొందరి పేర్లు వెలుగులోకి రావడంతో వారికి మీకు ఉన్న సంబంధం ఏంటీ అంటూ కూడా ఈడీ ప్రశ్నించింది. మొత్తానికి పూరిని పలు ప్రశ్నలతో డ్రగ్స్ కేసులో సుదీర్ఘంగా విచారించినట్లుగా సమాచారం అందుతోంది. ఈ కేసు సుదీర్ఘ కాలంగా కొనసాగుతుంది. ఈ కేసులో ఇంకా రవితేజ, ఛార్మి ఇంకా కొందరు కూడా ఉన్నారు. వారు కూడా విచారణకు హాజరు అవ్వాల్సి ఉంది.
559230 624262Nicely worded post will probably be sharing this with my readers this evening 297673