యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో తర్వాత చేస్తున్న చిత్రంకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు జాన్ లేదా ఓడియర్ అనే టైటిల్స్ను పరిశీలిస్తున్నారు. యూవీ క్రియేషన్స్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ప్రభాస్ ఇంకా ఇతర కీలక యూనిట్ సభ్యులపై జార్జియాలో షూటింగ్ నిర్వహించారు. అక్కడ షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లుగా దర్శకుడు ప్రకటించాడు.
జార్జియాలో మరో షెడ్యూల్ను పూర్తి చేసుకున్నాం. జార్జియాలో షూటింగ్కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అన్నాడు. చాలా స్పీడ్గా అనుకున్న టైం కంటే ముందే ఈ షెడ్యూల్ పూర్తి అవ్వడంలో హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసిన దర్శకుడు ప్రభాస్ 20 సినిమా ఫస్ట్ లుక్ త్వరలో అంటూ ప్రకటించాడు. ఉగాదికి ఫస్ట్ లుక్ వస్తుంది అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాధాకృష్ణ త్వరలో అంటూ ప్రకటించాడు కనుక ఖచ్చితంగా ఉగాదికే ఫస్ట్లుక్ వస్తుందంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక జార్జియా నుండి ఇండియాకు విమానంలో వస్తున్న ప్రభాస్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ ఫస్ట్లుక్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కు ఇది చాలా పెద్ద శుభవార్త అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు. ఫస్ట్లుక్తో పాటు టైటిల్ విషయంలో కూడా క్లారిటీ ఇస్తారని అంతా భావిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కృష్ణంరాజు ఇంకా పలువురు స్టార్స్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దసరాకు సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి కరోనా కారణంగా ఏమైనా ఆలస్యం అవ్వనుందా చూడాలి.
872485 39296Now we know who the ssebnile one is here. Excellent post! 608653
322525 503036Deference to op , some superb entropy. 202070
202806 869634I like this post, enjoyed this one appreciate it for putting up. 146074
121253 131052You produced some decent points there. I looked on the net towards the concern and discovered a lot of people goes together with along with your internet site. 21800