ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న ఆధిపత్య ఆటలో అధికారులు నలిగిపోతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న నిర్ణయాల విషయంలో అధికార పార్టీ పట్టు వీడకపోవడంతో ఆ ప్రభావం అధికారులపై పడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్ఈసీ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని సీఎం జగన్ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఎస్ఈసీపై పలు ఆరోపణలు చేసిన జగన్.. ఆయన నిర్ణయాన్ని సమీక్షించాలని కోరుతూ సీఎస్ నీలం సహానీ లేఖ రాయడం చర్చనీయాంశమైంది.
ఇదంతా ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడి వల్లే అనేది బహిరంగ రహస్యం. వాస్తవానికి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈసీదే సర్వాధికారం. రాష్ట్రానికి సంబంధించి ఎస్ఈసీ ఆధ్వర్యంలో సీఎస్ పని చేయాల్సి ఉంటుంది. అలాంటిది ఆయన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని లేఖ రాయడం పెద్ద సాహసమే అని చెప్పొచ్చు. విధి లేని పరిస్థితుల్లోనే సహానీ ఆ లేఖ రాయాల్సి వచ్చిందని తెలుస్తోంది.
అయితే, ఈ విషయాన్ని ఎస్ఈసీ తీవ్రంగా పరిగణించినా.. ఎవరైనా కేంద్ర సిబ్బంది వ్యవహారాల శిక్షణ సంస్థకు ఫిర్యాదు చేసినా సహానీకి ఇబ్బందులు తప్పవని ఐఏఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అదృష్టవంతుడని అంటున్నారు. ఎన్నికల సమయంలో ఈసీ ఆయన్ను సీఎస్ గా నియమించగా.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్నే కొనసాగించారు. అయితే, కొన్ని అంశాల్లో ప్రభుత్వ పెద్దలకు, ఆయనకు పొసగకపోవడంతో ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్ ను తెరపైకి తీసుకొచ్చి వ్యూహాత్మకంగా ఎల్వీకి చెక్ చెప్పించారు.
అనూహ్యంగా ఆయన్ను సీఎస్ గా తొలగించి, అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేశారు. అనంతరం నీలం సహానీని సీఎస్ గా నియమించారు. ఎల్వీని సీఎస్ గా రిలీవ్ చేయడం వల్ల ఆయనకు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందీ లేదని, కానీ సహానీ మాత్రం సమస్యల్లో కూరుకుపోతున్నారని అంటున్నారు. మరి వీటి నుంచి ఆమె ఎలా బయటపడతారో చూడాలి.
932565 196065Hello. I wanted to ask 1 thingis this a wordpress internet web site as we are planning to be shifting more than to WP. Furthermore did you make this template yourself? Thanks. 45001
575819 620760I surely didnt know that. Learnt 1 thing new these days! Thanks for that. 963404