ఈ మధ్యకాలంలో అందరి ఫోకస్ వెబ్ సిరీస్ లపై పడింది. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ మంచు సక్సెస్ అందుకుంటూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్న నేపథ్యంలో వెబ్ సిరీస్ చేసేందుకు స్టార్ హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో చేరాడు దర్శకుడు మారుతి తాను కూడా వెబ్ సిరీస్ చేస్తున్నారు తెలిపారు.
మారుతి తాజాగా తెరకెక్కించిన ప్రతిరోజు పండగే సినిమా మంచి సక్సెస్ వైపు దూసుకుపోతున్న సందర్బంగా అయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపాడు. హిందీలో సూపర్ హిట్టయిన లస్ట్ స్టోరీస్ ని తెలుగులో రీమేక్ చేయమని అఫర్ కూడా వచ్చిందని చెప్పాడు మారుతి. అయితే ఆ రీమేక్ చేయలేకపోయానని చెప్పాడు. కానీ భవిష్యత్తులో తాను తప్పకుండా వెబ్ సిరీస్ చేస్తానని చెప్పాడు.
ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈషా రెబ్బ ఈ సిరీస్ లో నటిస్తుంది. ఇక మారుతి తన నెక్స్ట్ సినిమాను ప్రముఖ్ నిర్మాత డివివి దానయ్య తనయుడు కళ్యాణ్ దాసరిని హీరోగా పరిచయం చేసే సినిమా చేస్తున్నట్టు తెలిసింది.
271124 546663Just a smiling visitant here to share the adore (:, btw outstanding style . 432325