Switch to English

ఉరి.. ఎన్ కౌంటర్: ఏది బెటర్?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

దిశ హత్య కేసులో నలుగురు నిందితులు ఎనిమిది రోజుల్లోనే ఎన్ కౌంటర్లో హతమయ్యారు. కానీ నిర్భయ హత్య కేసులో దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత దోషులకు ఉరి పడింది. అది కూడా ఎన్నో నాటకీయ పరిణామాలు, డ్రామాల నడమ. ఉరి తీయడానికి రెండు గంటల ముందు వరకు కూడా కోర్టులో వాదనలు జరిగాయి. ఏపీ సింగ్ వంటి వివాదాస్పద లాయర్ న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను అడ్డుపెట్టుకుని ఆడిన ఈ ఆట ఏకంగా ఇంతకాలం కొనసాగింది. ఒకదాని తర్వాత మరొకటి, అది విఫలమైతే ఇంకోటి.. ఇలా లెక్కకు మిక్కిలిగా ఒక్కో ఎత్తు వేస్తూ.. రకరకాల పిటిషన్లతో కింది స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు వెళుతూ న్యాయవ్యవస్థతో ఆడుకున్నారు.

అసలు నిర్భయ హంతకులకు ఉరి పడుతుందా లేదా అనే అసహనం జనాల్లో వచ్చేసింది. తన క్లైంట్లను రక్షించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో, ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్నీ ఏపీ సింగ్ చేశారు. వృత్తిపరంగా ఆయన్ను ఎవరూ తప్పుబట్టలేరు. ఒకవిధంగా మన న్యాయ వ్యవస్థలో ఎన్ని లోపాలున్నాయో ఈ కేసులో దేశానికి అర్థమైంది. వీటిని సరిదిద్దుకోవాల్సిన అవసరాన్ని ఏపీ సింగ్ కల్పించారు.

ఈ నేపథ్యంలో మరోసారి ఉరి, ఎన్ కౌంటర్లలో ఏది బెటరనే చర్చ తెరపైకి వచ్చింది. దిశ హత్య కేసులో నలుగురు నిందితులు ఎన్ కౌంటర్ కావడంతో జనం సంబరాలు చేసుకున్నారు. సీపీ సజ్జనార్ కు జైజైలు పలికారు. వరంగల్ యాసిడ్ దాడి నిందితుల ఎన్ కౌంటర్ లోనూ ఇదే విధమైన ప్రతిస్పందన కనిపించింది. కానీ నిర్భయ కేసు విషయానికి వచ్చేసరికి చివరి క్షణం వరకూ ఆమె తల్లిదండ్రులు పోరాడాల్సి వచ్చింది. ఓ దశలో నిర్భయ తల్లి ఆశాదేవి సైతం తమ బిడ్డను పొట్టనపెట్టుకున్న క్రూరులను ఎన్ కౌంటర్ చేయడమే బెటరని వ్యాఖ్యానించారు.

ఒక విధంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పు. అది పోలీసులకు కూడా వర్తిస్తుంది. కానీ నిర్భయ కేసు చూసిన తర్వాత అదే కరెక్టనే అభిప్రాయం ప్రజల్లో పాతుకుపోతోంది. ఏపీ సింగ్ వంటి అతి తెలివైన లాయర్లు న్యాయవవస్థతో ఆడుకోవడం కూడా తప్పేనంటున్నారు. ఇప్పటికైనా మన న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేయాల్సిందేనని స్పష్టంచేస్తున్నారు. ఈ కారణంగానే కదా.. చిలకలూరిపేట బస్సు దహనం కేసు దోషులు చివరి క్షణంలో ఉరిని తప్పించుకున్నారు. ఇలాంటివి జరగకుండా దోషులకు శిక్ష పడాలంటే మన వ్యవస్థలో సమూల మార్పులు జరగాల్సిందే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...