టాలీవుడ్ లో అత్యంత భారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. బాహుబలి తరువాత క్రేజీ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ పూణే లో జరుగుతుండగా రామ్ చరణ్ కాలికి గాయం అవ్వడంతో మూడు వారాలపాటు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ట్రిపుల్ ఆర్ యూనిట్ కి ఓ హీరోయిన్ కూడా షాకిచ్చింది. ఈ సినిమాలో తాను నటించడం లేదు అని ఆ హీరోయిన్ చెప్పింది.
ఆ వివరాల్లోకి వెళితే ఈ సినిమాలో హీరోయిన్స్ గా బాలీవుడ్ భామ అలియా భట్ ను , హాలీవుడ్ భామ డైసీ ఎడ్గార్ జోన్స్ లను ఎంపిక చేసారు. తాజగా డైసీ ఎడ్గార్ జోన్స్ ఈ సినిమాలో నటించలేకపోతున్నాను అంటూ, దానికి కారణాలు అనివార్యమని చెప్పింది. దాంతో షాక్ అయిన రాజమౌళి అండ్ టీమ్ ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని ఈ సినిమాలో డైసీ నటించడం లేదని ప్రకటించింది యూనిట్.
ఇటీవలే గుజరాత్ లో కూడా షూటింగ్ విజయవంతంగా పూర్తీ చేశామని, అక్కడి ప్రజలు ఎంతగానో సహకరించారని రాజమౌళి తెలిపారు. ఏప్రిల్ చివరి వారంనుండి ఈ సినిమా ఏకధాటిగా షూటింగ్ జరుపుకుని జూన్ 2020 లో విడుదల చేస్తారట. ఇప్పటికే ఈ సినిమా విషయంలో ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా అత్యంత క్రేజ్ నెలకొంది. టాలీవుడ్ స్టార్స్ చరణ్ – ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో సినిమా అనగానే అటు మెగా, ఇటు నందమూరి ఫాన్స్ తెగ ఆసక్తి ఎక్కువైంది.
12226 288829I believe other internet site owners really should take this web site as an example , very clean and fantastic user genial style . 526686
638842 288661Thanks for another informative post. Exactly where else could anyone get that kind of info in such a effortless to recognize way of presentation. 396159
696068 397652I was looking for this. Truly refreshing take on the information. Thanks a great deal. 536628