ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను ఏపీ సర్కారు బేఖాతరు చేయడం.. ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించడంతో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠాపై వేటు పడింది. ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ శుక్రవారం సాయంత్రం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఏపీ ప్రభుత్వ పెద్దలు అనుసరించిన వైఖరి కారణంగా పునేఠా శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందంటే ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలూ ఉండవు. చిన్న బదిలీ నుంచి ప్రజల్ని ప్రభావితం చేసే ఎలాంటి నిర్ణయమైనా సర్కారు తీసుకునే అవకాశం ఉండదు. కేవలం సాధారణ పరిపాలన వ్యవహారాలు మినహా విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదు.
ఎవరైనా అధికారి లేదా అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఫిర్యాదు వస్తే, ఈసీ దానిపై నివేదిక తెప్పించుకుని తగిన చర్యలు తీసుకుంటుంది. ఇదే విధంగా ఏసీబీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకకుళం, కడప ఎస్పీల విషయంలో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఫిర్యాదు ఆధారంగా వారిని బదిలీ చేసింది. ఈ వ్యవహారంలో ఏపీ సర్కారు ఈసీ ఆదేశాలను సక్రమంగా అమలు చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని అంటున్నారు.
తొలుత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆ ముగ్గురినీ బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పునేఠా ఉత్తర్వులు జారీచేశారు. అయితే, దీన్ని సర్కారు పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించారు. వెంటనే ఏసీబీ డీజీ బదిలీ నిలిపివేయాలని ఆదేశించారు. సర్కారు పెద్దల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు పునేఠా వ్యవహరించక తప్పలేదు. మరుసటి రోజు ఏసీబీ డీజీ బదిలీ రద్దు చేస్తే సవరణ ఉత్తర్వులు జారీచేశారు.
అంతేకాకుండా ఎన్నికల సంఘం ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పరిణామాలన్నీ ఈసీ ఆగ్రహానికి కారణమయ్యాయి. మరోవైపు హైకోర్టు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. దీంతో ఏసీబీ డీజీని బదిలీ చేయక తప్పలేదు. మొత్తమ్మీద ఈ వ్యవహారంలో వ్రతమూ చెడింది.. ఫలితమూ దక్కలేదు. అయితే, తమ ఆదేశాలను ధిక్కరించడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం.. పునేఠాను ఢిల్లీ పిలిపించి, వివరణ అడిగింది.
ఏసీబీ డీజీని బదిలీ చేస్తే, ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటని ఆరా తీసినట్టు సమాచారం. మాకు చట్టం తెలియకుండానే ఏసీబీ డీజీని బదిలీ చేశామా? మా ఆదేశాలను ఎందుకు ఖాతరు చేయలేదని ప్రశ్నించినట్టు తెలిసింది. తాను సీఎం ఆదేశాల మేరకే నడుచుకున్నానని పునేఠా చెప్పడంపై అసంతృప్తి వ్యక్తంచేసిన ఎన్నికల సంఘం.. పునేఠాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పించాలని నిర్ణయించింది.
కారాణాలు ఏవైనా.. తమ ఆదేశాలను ధిక్కరించిన సీఎస్ ను ఇంకా అవే బాధ్యతల్లో కొనసాగిస్తే, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని భావించడంతోనే కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. అనంతరం 1983 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంను కొత్త సీఎస్గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పునేఠకు తదుపరి పోస్టింగ్పై తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తామని జీవోలో పేర్కొన్నారు. కాగా, ఏపీ సీఎస్ గా నియమితులైన ఎల్వీ సుబ్రహ్మణ్యం శనివారం ఉదయం అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా పాలన ఉంటుందని స్పష్టం చేశారు. 36 ఏళ్ల సర్వీస్లో ఇదో కొనసాగింపు మాత్రమేనని.. ఎలాంటి ఒత్తిడికి గురి కావడం లేదని పేర్కొన్నారు.
358055 963414jobs for high school students – Search for Jobs on our site, we offer several very good links towards the very best and biggest Portals to obtaining a Job as a high school student! 802696
850771 235396Your writing is fine and gives food for thought. I hope that Ill have far more time to read your articles . Regards. I wish you which you frequently publish new texts and invite you to greet me 842775
586334 68137An intriguing discussion will probably be worth comment. I think which you simply write considerably far more about this topic, it may well become a taboo subject but normally consumers are inadequate to communicate in on such topics. To another. Cheers 966117
529049 10923Hey there! Someone in my Myspace group shared this website with us so I came to take a look. Im certainly enjoying the details. Im bookmarking and is going to be tweeting this to my followers! Exceptional weblog and outstanding style and design. 704374
231410 139087Outstanding post, I conceive blog owners ought to acquire a great deal from this blog its really user pleasant. 274181