తెలంగాణ రాష్ట్రం సూర్యపేట జిల్లా కేంద్రంలో మూడు రోజుల క్రితం ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను చెరువులో తోసిన సంఘటన పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే. భర్తతో విభేదాల కారణంగా ఆమె తన పిల్లలను చంపేసి ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుందని, కాని చివరి నిమిషంలో ఆమె తన మనసు మార్చుకుని పిల్లలను మాత్రం చంపేసి అక్కడ నుండి వెళ్లి పోయిందని అంతా అనుకున్నారు. కాని తాజాగా పోలీసుల విచారణలో ఆశ్చర్యకర విషయాలు బయట పడ్డాయి.
సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పిల్లలను చంపిన నాగమణి కదలికలు గుర్తించిన పోలీసులు ఆమెకు ఆటో డ్రైవర్ మధుతో అక్రమ సంబంధం ఉందని గుర్తించారు. నాగమణిని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా అప్పుడు ఆమె అసలు విషయాన్ని చెప్పింది. మధుతో ఉన్న అక్రమ సంబంధంకు పిల్లలు అడ్డు వస్తున్నారని, భర్త నుండి విడిపోవడానికి కూడా పిల్లలు అడ్డుగా ఉన్నారనే కారణంతో తాను ఈ పని చేసినట్లుగా నాగమణి ఒప్పుకుంది. అత్యంత నీచంకు పాల్పడ్డ నాగమణిని వెంటనే శిక్షించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ సంబంధం మోజుతో పండంటి సంసారంను నాశనం చేసుకున్న నాగమణిని ఏం అన్నా కూడా తప్పు లేదంటున్నారు.
880280 410339There is evidently a good deal to know about this. I consider you made certain good points in features also. 147846