ఏడాది దాటినా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. దేశంలో సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఇప్పటికే పలుమార్లు తన రూపాన్ని, శక్తినీ మార్చుకున్న ఈ మహమ్మారి.. తాజాగా మరింత కొత్తగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం దీని లక్షణాల్లో తలనొప్పి, కీళ్లనొప్పులు కూడా చేరాయి. జ్వరంతోపాటు కీళ్లనొప్పులతో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెబుతున్నారు. తలనొప్పి, తీవ్ర నీరసం, ఒళ్లునొప్పులతో బాధపడేవారిని పరీక్షించినప్పుడు కూడా పాజిటివ్ గా తేలుతున్నట్టు వెల్లడైంది.
కనుగుడ్డు నుంచి సైతం వైరస్ శరీరంలోకి చేరుతోందని, అలాంటివారిలో కళ్ల ఎర్రబడుతున్నాయని చెబుతున్నారు. జ్వరంతోపాటు విరేచనాలు ఉన్నా అశ్రద్ధ చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం యువతే కరోనాబారిన పడేవారిలో అధికంగా ఉంటున్నారు. తొలి దశలో 40 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్నవారు అధికంగా కరోనా బారిన పడగా.. ప్రస్తుతం 20 నుంచి 35 ఏళ్ల లోపున్నవారికే కరోనా ఎక్కువగా సోకుతోందని గణాంకాలు చెబుతున్నాయి. మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం వంటివే ఇందుకు కారణాలని పేర్కొంటున్నారు.
292189 237843I really dont accept this certain write-up. Nonetheless, I had searched with Google and Ive found out that youre proper and I had been thinking inside the improper way. Maintain on creating top quality material similar to this. 135009