దేశంలో కరోనా కేసుల సంఖ్య చాపకింద నీరుల పెరుగుతోంది. గత నెలలోఈ సంఖ్య తక్కువ అనిపించినా నెల రోజుల గ్యాప్ లో ఏకంగా మిలియన్ కు చేరడం ఆందోళన కలిగిస్తుంది. లాక్డౌన్ సఢలించిన తర్వాత కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ప్రతి రోజు పాతిక వేల నుండి 35 వేల వరకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 10 లక్షల కేసులు దాటిన నేపథ్యంలో భారత్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ నిపుణులు భయాందోళనకు గురి అవుతున్నారు.
ప్రపంచ సగటుతో పోల్చితే ఇండియా సగటు కాస్త తక్కువగా ఉండటం ఊరటనిచ్చే విషయం. నేటి ఉదయం వరకు అందిన లెక్కల ప్రకారం ఇండియా మొత్తంలో 10,03,832 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు కరోనా కారణంగా పాతిక వేల మంది మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సగటుతో పోల్చితే ఇండియా సగటు కాస్త తక్కువగానే ఉంది. కరోనా రికవరీ శాతం ఇండియాలో ఆశాజనకంగా ఉందని నిపుణులు పేర్కొన్నారు.
ప్రభుత్వాలు కేసుల సంఖ్య తగ్గించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. గత నెలలో ఒక అంతర్జాతీయ సంస్థ జులై 15 నాటికి భారత్లో కరోనా కేసుల సంఖ్య 15 లక్షలకు చేరే అవకాశం ఉందన్నారు. వారి అంచనా తప్పయ్యింది. ఇండియన్స్ జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యంలో మిలియన్ మార్క్ వద్దే కేసులు ఉన్నాయి.
386092 766674Some genuinely good stuff on this website , I enjoy it. 156647