Switch to English

5 కోట్లు.. అబ్బే, ఆయనకి అస్సలేమాత్రం సంబంధం లేదు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పది లక్షలో, పాతిక లక్షలో తీసుకెళుతూ పోలీసులకు దొరికితే.. ఆ తర్వాత సామాన్యుడు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. లెక్కలన్నీ పక్కాగా చూపించాల్సి వుంటుంది. అదే, రాజకీయ నాయకుల విషయంలో అయితే పరిస్థితి ఇంకోలా వుంటుంది. అందునా, అధికార పార్టీకి చెందిన నేతల విషయంలో కోట్లు పట్టుబడినా, ‘అబ్బే.. అంతా తూచ్‌..’ అనేస్తుంటారు. తమిళనాడు సరిహద్దుల్లో రాష్ట్రంలోని అధికార పార్టీ నేతకి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి నుంచి 5కోట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వైసీపీ నేత, మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పేరు తెరపైకొచ్చింది. మరో వైసీపీ ముఖ్య నేత అన్నా రాంబాబు పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది.

అయితే, అది అక్రమ సొమ్ము కాదు.. సక్రమ సొమ్మేనని అంటున్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నల్లమల్లి బాబు. బంగారం కొనుగోలు కోసం ఆ సొమ్ము తీసుకెళుతున్నామనీ, దానికి సంబంధించి అన్ని లెక్కలూ పక్కాగా వున్నాయని చెబుతున్నారాయన. అయితే, మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి నల్లమల్లి బాలు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి కావడం, పైగా.. మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పేరుతో ‘అధికారిక స్టిక్కర్‌’ని జిరాక్స్‌ చేసి, వేరే వాహనానికి వాడి, దాంట్లో డబ్బుని తరలించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ‘వైసీపీ నేతల దోపిడీకి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? దొరికింది కొంత మాత్రమే.. దొరకనిది కొండంత..’ అంటోంది ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ.

‘స్టిక్కర్ల రాజకీయం’లో వైసీపీ మాస్టర్‌ డిగ్రీ చేసేసిందనీ, ఇలాంటి దొంగ స్టిక్కర్లతో ఎన్ని వాహనాల్లో డబ్బులు తరలించేస్తున్నారోనని టీడీపీతోపాటు ఇతర విపక్షాలూ అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి, ఇది చాలా చాలా సీరియస్‌ అంశంగానే పరిగణించాల్సి వుంటుంది. చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద కేసులు పెడుతున్న ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ విభాగం, ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు తరలిస్తుండడం, పైగా నకిలీ స్టిక్కర్లను వాహనాలకు అంటించి పోలీసుల కళ్ళు గప్పే ప్రయత్నం చేసిన దరిమిలా.. తెరవెనుక ‘కుట్ర’ని బయటపెట్టాల్సిందేనన్న డిమాండ్లు తెరపైకొస్తున్నాయి. కాగా, మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, మరో వైసీపీ నేత అన్నా రాంబాబు, ఈ ఘటనతో తమకేమీ సంబంధం లేదని చెబుతున్నారు. నకిలీ స్టిక్కర్‌ ఉదంతంపై విచారణ జరగాల్సిందేనని అంటున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...