Switch to English

అమూల్ సంస్థకు ఏపీలో బ్రాండ్ అంబాసిడర్ గా సీఎం జగన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

గుజరాత్ కు చెందిన పాల ఉత్పత్తుల సంస్థ అయిన అమూల్ కు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏపీలో బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. వేల కోట్ల ఆస్తులను స్థానికంగా ఉండే డెయిరీలకు కాదని ఉత్తరాది సంస్థ కు కట్టబెడుతున్నారు. రాష్ట్రంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన విజయ డైరీ పునరుద్ధరణ పేరుతో సుమారు రూ.650 కోట్ల ప్రజాధనాన్ని కారుచౌకగా కేవలం ఏడాదికి రూ. కోటి లీజుకు 99 ఏళ్ల పాటు అమూల్ కు అప్పగించారు. నిన్నమొన్నటి వరకు హెరిటే, సంగం డైరీలపై విషం చల్లిన వైసీసీ నాయకులు అమూల్ విషయంలో మాత్రం ఎక్కడ లేని ప్రేమను చూపిస్తున్నారు. ఇప్పటికే చిత్తూరులో శివశక్తి డైరీ పేరుతో స్థానిక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాడి రైతులను దోపిడీ చేస్తుంటే… అమూల్ పేరుతో సీఎం జగన్ పెద్ద కుట్రకు తెరతీశారు. పొరుగు రాష్ట్రాలు అయిన తమిళనాడు, కర్ణాటకలు అమూలు మోసాలను గ్రహించి దూరం పెడితే.. కమీషన్ల కోసం, తన మీద ఉన్న కేసుల మాఫీ కోసం ఆంధ్ర పాడిరైతుల భవిష్యత్తును గుజరాత్ కార్పొరేట్ కాళ్ల కింద పెట్టారు.

రాష్ట్రంలోని డైరీలు లాభాల నుంచి బోనస్ తో పాటు పశువులకు వైద్యసేవలు, తక్కువ ధరకు దాణా, మేలు జాతీ పశువుల వీర్యాన్ని పాడిరైతులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాడి పరిశ్రమకు ఊతాన్ని ఇస్తున్నాయి. అలాంటి కో- ఆపరేటివ్, ప్రైవేటు డైరీలకు జగన్ సర్కార్ ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. కానీ అమూల్ డైరీకి మాత్రం అప్పనంగా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ రూ. 6 వేల కోట్లను కట్టబెట్టింది. చిత్తూరు పునరుద్ధరణ ముసుగుతో ప్రజధనాన్ని అమూల్ కు దోచిపెడుతూ.. అందులోని కమీషన్లు సరాసరి తాడేపల్లి ప్యాలెస్ కు చేరేలా పథక రచన చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. చిత్తూరు కలెక్టరేట్ సమీపంలో ఉన్న సుమారు 33 ఎకరాల విజయ డైరీ భూమిని ఈ ప్రక్రియలో భాగంగా కాజేశారు. జపాన్, జర్మనీల నుంచి సుమారు రూ. 30 కోట్ల విలువైన డైరీ సామాగ్రిని తెప్పించారు. వీటిని కూడా అమూల్ పరం చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం. ఎప్పటి నుంచో పాడి రైతులకు అండగా నిలుస్తున్న ఇతర డైరీలను నిర్వీర్యం చేసే దిశగా జగన్ రెడ్డి ఈ గుజరాత్ కంపెనీకు దోచిపెడుతున్నారు.

అన్నీ తామై అమూల్ కు అండగా…

ఏపీలోని అంగన్వాడీ కేంద్రాలకు కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్ కు సంబంధించిన నందిని అనే పాల ఉత్పత్తి సంస్థ రవాణా ఖర్చులతో కలిపి లీటరు రూ.57.25 చొప్పున పాలను సరఫరా చేస్తుండగా.. అమూల్ కు మాత్రం రవాణా ఖర్చులను తామే చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడం వైసీపీ, అమూల్ సంస్థకు మధ్య ఉన్న లాలూచీ ఒప్పందాలు అర్థం అవుతున్నాయి. ఈ పాల సరఫరా ఒప్పందం ప్రకారం అముూల్ పై పన్ను భారం పడకుండా తామే చెల్లిస్తామంటూ ప్రభుత్వం పేర్కొంది. పాలపై విధించే 5% జీఎస్టీ కూడా ప్రభుత్వమే భరించనుంది. ఇలా రవాణా ఖర్చులు, పన్నుల రూపేణా ప్రభుత్వానికి ఏడాదికి రూ.12 కోట్ల భార పడనుంది. ఇలా అమూల్ కు జగన్ రెడ్డి రూపాయికి రూపాయి దోచి పెడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....