‘రామోజీ ఫిలిం సిటీని అమ్మేస్తున్నారట.. రామోజీ ఫిలిం సిటీని వదిలించేసుకుంటున్నారట.. రామోజీ ఫిలింసిటీని అద్దెక్కిచ్చేస్తున్నారట.. రామోజీ ఫిలింసిటీని లీజుకిచ్చేస్తున్నారట.. రామోజీరావు పనైపోయినట్లే.. కరోనా దెబ్బకి రామోజీ ఆర్థికంగా చితికిపోయారు..’ అంటూ కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలోనూ, వెబ్ మీడియాలోనూ కథనాలు పుట్టుకొచ్చాయి గత కొద్ది రోజులుగా. ఇంతకీ ఏది నిజం.? అంటే, ‘ఇదిగో ఇదీ నిజం..’ అంటూ ఓ వివరణ బయటకు వచ్చింది.
కొన్ని ప్రముఖ సంస్థలకు (జీ, సోనీ) రామోజీ ఫిలింసిటీలో షూటింగుల కోసం ప్రత్యేకంగా వెసులుబాట్లు కల్పించారట. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఏ స్థాయిలో నష్టపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక, రామోజీ ఫిలిం సిటీ విషయానికొస్తే, నిత్యం వందలాది మంది.. వేలాదిమంది సందర్శకులు ఈ ఫిలింసిటీని సందర్శిస్తుంటారు.. నిత్యం షూటింగులు జరుగుతుంటాయి. లాక్డౌన్ ఎఫెక్ట్ ఫిలింసిటీపైన కూడా పడిన మాట వాస్తవం.
ఈ నేపథ్యంలో ‘ఉభయతారకంగా’ అన్నట్లు, ఫిలింసిటీలో ఆయా సంస్థలకు షూటింగుల కోసం కొన్ని వెసులుబాట్లు కల్పించారు. తద్వారా యాక్టివిటీ పెరుగుతుంది.. సితార వంటి హోటల్స్లో ఆతిథ్యం ఎలాగూ ఖరీదైనది కాబట్టి.. ఆదాయం దండిగా సమకూరుతుంది. షూటింగ్కి అవసరమైన సాంకేతిక సహాయం (ఎక్విప్మెంట్) అద్దెకు తీసుకోవాలి కాబట్టి.. అదీ ఫిలింసిటీకి లాభమే. ఇదీ రామోజీ ఫిలింసిటీ వ్యవహారం. ఎలాగైతేనేం, ఫిలింసిటీపై పుకార్లకు చెక్ పడింది. మంచి విషయమే ఇది.
కానీ, ఈనాడు సంస్థలో ఉద్యోగుల తొలగింపు వ్యవహారమేమిటి.? కిందిస్థాయి ఫీల్డ్ స్టాఫ్ని రెండు మూడు నెలల నుంచి ఇంటికే పరిమితం చేసిన ఈనాడు సంస్థ, వారిని పూర్తిగా తొలగించేందుకు రంగం సిద్ధం చేసుకుందట.. అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొంతమంది కీలకమైన సిబ్బందికి కూడా లే-ఆఫ్ ప్రకటించిందట సంస్థ. ఈ విషయమై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ‘ఈనాడు బాధితులు’ అంటూ కొందరు సోషల్ మీడియాలో ఈనాడుకి సంబంధించిన అంతర్గత విషయాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఈనాడుకి పాఠకులు గణనీయంగా తగ్గిపోయారు. అన్ని పత్రికలదీ ఇదే పరిస్థితి. అయితే, మూడు నాలుగు నెలలకే ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయేలా పెద్ద పెద్ద సంస్థలు వుంటాయా.? బలమైన పునాదుల మీద ఏర్పడ్డ ఓ ‘సామ్రాజ్యం’గా మీడియా సంస్థల్ని అభివర్ణిస్తుంటారు. మరి, ఈ గాసిప్స్ మాటేమిటి.? ఈ గాసిప్స్పై ఈనాడు సంస్థ ఇంతవరకు ఎందుకు స్పందించలేదు.? అన్నది చాలామంది ప్రశ్న.
ఏమో, రామోజీ ఫిలింసిటీపై వివరణ వచ్చినట్లే, ఈనాడు చుట్టూ విన్పిస్తున్న గాసిప్స్పైనా స్పందన త్వరలోనే వస్తుందేమో.! ఏదిఏమైనా, ఈనాడు యాజమాన్యం కరోనా పేరు చెప్పి, తమకు అన్యాయం చేస్తోందని ఈనాడు ఉద్యగోలు గగ్గోలు పెడుతున్నట్లు గత రెండు మూడు నెలలుగా మీడియా వర్గాల్లో రచ్చ జరుగుతున్నా లేని స్పందన.. రామోజీ ఫిలిం సిటీపై గాసిప్స్ రాగానే ఆగమేఘాల మీద రావడం.. అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
392249 267343Hello. I wanted to ask one thingis this a wordpress web website as we are preparing to be shifting over to WP. Furthermore did you make this template yourself? Thanks. 317956
743657 932564Hello. Cool write-up. Theres an concern with the internet site in internet explorer, and you may want to test this The browser is the marketplace chief and a large element of other folks will miss your excellent writing due to this difficulty. 287414