ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూల్ ఓర్వకల్లు విమానాశ్రయానికి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడుతున్నట్లు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. భారతదేశ మొట్టమొదటి స్వతంత్ర సమరయోధుడిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి పేరుంది. రాష్ట్రంలో 6వ విమానాశ్రయాన్ని ప్రారంభించిన సందర్భంగా జగన్ ఈ ప్రకటన చేసారు.
జగన్ తీసుకున్న నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేసారు. “వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మొదటి స్వతంత్ర సమరయోధుడికి ఇచ్చిన ఘనమైన నివాళి ఇది. సైరా చిత్రంలో అంత ఉత్తముడి పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు చిరంజీవి.
ప్రస్తుతం చిరంజీవి ఆచార్య చిత్రంలో నటిస్తున్నాడు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మే 13న ఆచార్య విడుదల కానుంది.
101346 461082Rattling exceptional information can be found on web blog . 609430
933449 971699Id always want to be update on new blog posts on this internet web site , bookmarked ! . 224213