Chiranjeevi: కళతో ప్రేక్షకులను అలరించే అన్నయ్య.. సేవతో ప్రజా శ్రేయస్సు కోరే తమ్ముడు.. వారి దారులు వేరు కానీ.. లక్ష్యం మాత్రం ఒక్కటే. దశాబ్దాలుగా వీరు ప్రేక్షకులను అలరిస్తూనే.. సమాజ సేవకూ కంకణబద్దులై ఉన్నారు. ఇందుకెన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆమధ్య కౌలు రైతులను పవన్ కల్యాణ్ ఆదుకున్న తీరు అన్నయ్య చిరంజీవి (Chiranjeevi)ని మెప్పించింది. దీంతో తన వంతుగా రూ.5కోట్ల భారీ విరాళాన్ని జనసేన (Janasena)కు విరాళంగా ప్రకటించి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు అండగా నిలిచారు. ఈమేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..
‘అధికారంలోకి వచ్చాకే ఎవరైనా సాయం చేస్తామంటారు. అధికారం లేకపోయినా తన సంపాదనతోనే రైతు కూలీలను ఆదుకున్న పవన్ కల్యాణ్ ఉదారత నాకు సంతోషాన్ని కలిగించిన విషయం. స్వార్జితాన్ని సమాజానికి వినియోగించే మనసున్న తమ్ముడు పవన్ కల్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో జనసేనకు నావంతు విరాలాన్ని అందజేస్తున్నా’నని తెలిపారు. చిరంజీవి ఉన్నతమైన మనసుకి.. ఉదార స్వభావానికి మెగాభిమానులు, జనసైనికులే కాదు ప్రజల నుంచి కూడా సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
అందరు అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తాం అంటారు.అధికారం లేకపోయినా, తన సంపాదన ని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం.తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేన కి… pic.twitter.com/dJeJNcPp4x
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2024