చిరంజీవి అంటే మెగాస్టార్.! వెండితెరపై తనదైన డాన్సులతో, ఫైట్లతో అలరించారు. మాస్ హీరో అన్న మాటకి నిలువెత్తు నిదర్శనం చిరంజీవి. ఆ చిరంజీవిలో ‘సున్నితమైన కోణాన్ని’ వెండితెరపై ఆవిష్కరించిన ఘనత మాత్రం ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్కే దక్కుతుంది.
ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు, స్వయంగా మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. ‘యాక్షన్ హీరోగా.. మాస్ హీరోగా ముద్ర పడ్డ నన్ను, సున్నితమైన సినిమాల వైపు మళ్ళించిన దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్..’ అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.
కళా తపస్వి కె.విశ్వనాథ్ ఇకలేరన్న మాటని తాను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాననీ, భౌతికంగా ఆయన మన మధ్యన లేకున్నా.. ఆయన తెరకెక్కించిన అత్యద్భుత చిత్రాల ద్వారా ఎప్పటికీ మన మనసుల్లో ‘కళాతపస్వి’గా వుంటారని చిరంజీవి అన్నారు.
హైద్రాబాద్లో జరిగిన కళాతపస్వి కె.విశ్వనాథ్ సంస్మరణ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడారు. అంతకు ముందు చిరంజీవి, సినీ నటుడు తారకరత్న అకాల మరణం పట్ల తీవ్ర దిగ్రభాంతిని వ్యక్తం చేశారు. ‘పరిశ్రమ ఓ యువ హీరోని కోల్పోయింది.. తారకరత్న అకాల మరణం పట్ల రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం..’ అంటూ చిరంజీవి చెమర్చిన కళ్ళతో వ్యాఖ్యానించారు.
అనంతరం, కె.విశ్వనాథ్ గురించి మాట్లాడుతూ, ‘ఆయన నాకు పితృ సమానులు. ఎందుకంటే, నన్ను మాస్ సినిమాల వైపు నుంచి క్లాస్ సినిమాల వైపు మళ్ళించారు. సున్నితమైన నటన, సున్నితంగా డైలాగులు చెప్పే విధానం ఇవన్నీ ఆయన్నుంచే నేను నేర్చుకున్నాను..’ అని చెప్పారు చిరంజీవి.
‘ఆపద్భాందవుడు’ సినిమాలోని ఓ సన్నివేశంలో నటించాలన్నప్పుడు, ఆ సన్నివేశం తాలూకు తీవ్రత తెలిసి ఆందోళన చెందాననీ, విశ్వనాథ్ గారి దగ్గరకు ముందురోజు వెళ్ళి, తన అనుమానాల్ని నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించానని చిరంజీవి అన్నారు.
‘ఆయన ప్రతి సన్నివేశాన్నీ చేసి చూపించేస్తుంటారు. గురువులా ఆయన నాకు ఆ సన్నివేశంలో ఎలా నటించాలో చూపించేసరికి, అక్కడే పలుమార్లు ప్రాక్టీస్ చేశాను. ఆ మరుసటిరోజు సెట్లో చాలా తేలిగ్గా అంత కష్టమైన సన్నివేశాన్ని పూర్తి చేసెయ్యగలిగాను..’ అని చిరంజీవి వివరించారు.
ఓ సినిమా షూటింగ్ సమయంలో డైలాగ్ వేగంగా చెప్పేస్తోంటే, ‘నిన్నెవరైనా తరుముతున్నారా.? నెమ్మదిగా చెప్పవయ్యా.? ప్రతి అక్షరం, ప్రతి మాటా నీకు అర్థమవ్వాలి. చూసేవాళ్ళకి స్పష్టంగా అర్థం కావాలి..’ అని విశ్వనాథ్గారు చెప్పడం ఇప్పటికీ మర్చిపోలేనని అన్నారు చిరంజీవి.
‘నటనలో సున్నితత్వం.. డైలాగ్ డెలివరీలో నెమ్మది.. ఇవన్నీ విశ్వనాథ్గారి కారణంగానే నాకు అలవాటయ్యాయి..’ అని మెగాస్టార్ చిరంజీవి చెప్పడం గమనార్హం.
‘డైట్ పేరు చెప్పి, భోజనం మానేసిన సందర్భంలో, విశ్వనాథ్గారు స్వయంగా తన చేత్తో కలిపిన పెరుగన్నం నాకు పంపించారు. ఆ విషయం తెలిసి నా కళ్ళు చెమర్చాయి. ఓ తండ్రిగా ఆయన నా ఆకలి గురించి పట్టించుకున్నారు. అది ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే, ఆయన నాకు పితృ సమానులు’ అని చెప్పే క్రమంలో చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.
కె.విశ్వనాథ్ వృద్ధాప్యం కారణంగా బయటకు రాలేని పరిస్థితుల్లో వున్నప్పుడు, తరచూ చిరంజీవి ఆయన ఇంటికి వెళ్ళేవారు. అలా వెళ్ళిన ప్రతిసారీ, చిరంజీవి ఆయన వద్ద చంటి పిల్లాడిలా మారిపోయేవారు. చిరంజీవి – విశ్వనాథ్ మధ్య వున్న అనుబంధం.. మాటలకందనిది.!
614031 746388This web page is known as a stroll-by for all of the details you wished about this and didnt know who to ask. Glimpse appropriate here, and youll positively discover it. 439738
272569 49647Completely composed content material material , Genuinely enjoyed examining . 321827