అమెరికా కు చెందిన రికార్డెడ్ ఫ్యూచర్ సంచలనాత్మక విషయాలను బయట పెట్టింది. ఇండియా ను చైనా సంస్థలు దొంగ దారిన సైబర్ దాడులతో దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నించినట్లుగా రికార్డెడ్ ఫ్యూచర్ వారు అంటున్నారు. గత ఏడాది అక్టోబర్ లో ముంబయి మొత్తం కరెంట్ పోయింది. ఆ సమయంలో రైళ్ల రాకపోకలతో సహా మొత్తం స్థంభించింది. దానికి కారణం చైనా సంస్థ రెడ్ ఎకో గ్రూప్ అంటూ వారు నమ్మకంగా చెబుతున్నారు. భారత్ లోని ఐదు ప్రైమరీ డిశ్పాచ్ సెంటర్లలో ఉన్న కంప్యూటర్ నెట్ వర్క్ ను వారు హ్యాక్ చేసి డౌన్ చేసే ప్రయత్నం చేశారట.
లద్దాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్బంలో భారత్ దృష్టిని అటు మరల్చి భారత విద్యుత్ గ్రిడ్ పై చైనా విరుచుకు పడాలనుకుంది అంటూ అమెరికన్ సంస్థ పేర్కొంది. ముంబయిలో రెండు గంటలు పూర్తి విద్యుత్ అంతరాయం కు కారణం చైనా వారే అంటూ వారు చెబుతున్న నేపథ్యంలో ఇండియా ఎలా స్పందిస్తుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక వైపు చర్చలు అంటూనే మరో వైపు ఆక్రమణలు ఇలా దొంగ దెబ్బలతో చైనా తన దుర్ణీతిని కనబర్చుతూనే ఉంది.
278839 901442Quite nice design and style and great subject matter, really small else we want : D. 390206