మెగా పవర్ స్టార్ గా వెండితెరపై అదరగొట్టిన రామ్ చరణ్ ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తనున్నట్టు తెలిసింది. ఆ అవతారం ఎదో కాదు ఈ సారి ఆయన బుల్లితెరపై యాంకర్ గా కనిపిస్తాడట? వాట్ .. చరణ్ యాంకర్ గా మారడం ఏమిటి? అనుకుంటారా .. అసలు విషయంలోకి వెళితే రామ్ చరణ్ తాజాగా మెగాస్టార్ తో సైరా సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమా విషయంలో ఆశించిన స్థాయి హైప్ రాకపోగా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయట. దాంతో ఈ సినిమాకు హైప్ తెచ్చే పనిలో భాగంగా తాను యాంకర్ గా మరి ఇందులో నటిస్తున్న కీలక నటీనటులను ఇంటర్వ్యూ చేస్తాడట.
రామ్ చరణ్ తో ఇంటర్వ్యూ అంటే ఇందులో నటిస్తున్న అమితాబ్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, సుదీప్ ఇలా పూర్తీ డీటెయిల్ తో ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి .. సైరా పై ఇంకా ఆసక్తి పెరిగేలా ఈ ఇంటర్వూస్ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే దానికి సంబందించిన సన్నాహాలు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ ఐడియా విన్న వాళ్ళు కూడా బాగుందని ప్రొసీడ్ అని చెప్పారట. దసరా సందర్బంగా అక్టోబర్ 2న ఈ సినిమాను భారిగా విడుదల ప్లాన్ చేసారు.
ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తయింది కాబట్టి .. ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇప్పటికే ఇందులో నటించిన వాళ్ళకోసం ప్రత్యేక డేట్స్ కు ఇన్వైట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇందులో నయనతార, చిరంజీవి కూడా ఉంటారట. మొత్తానికి నిర్మాతగా భారీ బడ్జెట్ సినిమాను నిర్మించిన చరణ్ ఇప్పుడు ఆ సినిమాను ప్రమోట్ చేసే పనులను తన భుజాలపై వేసుకున్నాడు.
991779 343708Merely wanna state that this is really beneficial , Thanks for taking your time to write this. 460091
292741 864155I conceive this web internet site holds some real superb data for everybody : D. 85936