నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ తీరు. ఓ పక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి విరాళాలు ఇచ్చేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు లాక్డౌన్ నిబంధనల్ని తుంగలోకి తొక్కి మరీ వస్తోంటే, ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాత్రం 14 రోజుల పాటు క్వారంటైన్కి ఒప్పుకుంటేనే, ఆంధ్రప్రదేశ్లోకి అనుమతిస్తామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.
తాజాగా మంత్రి మోపిదేవి వెంకటరమణ చేసిన ‘క్వారంటైన్’ వ్యాఖ్యలిప్పుడు హాస్యాస్పదమవుతున్నాయి. చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్.. ఇద్దరూ ప్రస్తుతం హైద్రాబాద్లో వున్నారు. కరోనా వైరస్ కారణంగా అమల్లో వున్న లాక్డౌన్ నేపథ్యంలో చంద్రబాబు, లోకేష్.. ఇద్దరూ గత కొంతకాలంగా హైద్రాబాద్కే పరిమితమయ్యారు. హైద్రాబాద్లో వుండిపోయినప్పటికీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నేతలకు టచ్లోనే వున్నారు చంద్రబాబు, నారా లోకేష్.
సరే, ప్రతిపక్షంగా టీడీపీ సరైన పాత్ర పోషిస్తోందా.? లేదా.? అన్నది వేరే చర్చ. ‘దమ్ముంటే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కి రావాలి..’ అంటూ ఓ పక్క వైసీపీ నేతలే సవాల్ విసురుతున్నారు. ‘ప్రజలంటే చంద్రబాబుకి లెక్క లేదు.. ప్రజల మధ్య వుండాల్సిన చంద్రబాబు హైద్రాబాద్లో దాక్కున్నారు..’ అని విమర్శలు చేస్తున్నదీ వైసీపీ నేతలే.
అదే వైసీపీ నేతలు, చంద్రబాబు ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి రావాలంటే 14 రోజుల పాటు క్వారంటైన్లో వుండాలని తేల్చి చెబుతున్నారు. మరి, మేఘా సంస్థ అధినేత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎలా వచ్చి, వైఎస్ జగన్కి ‘విరాళం’ అందించినట్లు.? కరోనా వైరస్ సంగతేమోగానీ, ఈ పొలిటికల్ వైరస్ ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ప్రత్యేకం అన్నట్లుగా తయారైంది. దేశంలో ఏ ఇతర రాష్ట్రాల్లోనూ ఈ రాజకీయ దుస్థితి, రాజకీయ అజ్ఞానం లేదేమో.!
455086 499065I believe this web internet site contains extremely superb composed articles posts . 910281
200287 805355It is difficult to get knowledgeable individuals within this subject, nevertheless, you appear to be guess what happens you are dealing with! Thanks 708151
995580 590189Extremely intriguing subject , thanks for putting up. 377115
701697 363719Some truly exceptional articles on this internet site , regards for contribution. 349762