మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమా విషయంలో ఎంతగా కష్టాలు పడ్డాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ‘రేయ్’ అనే చిత్రంతో సాయి ధరమ్ తేజ్ పరిచయం అవ్వాల్సి ఉంది. కాని అది మూడు సంవత్సరాలు పట్టింది. ఏవో కారణాల వల్ల ఆ సినిమా విడుదల ఆగింది. ఆ సినిమా కంటే ముందే తేజ్ పిల్లా నువ్వు లేని జీవితం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2012లో తేజ్ మొదటి సినిమా రేయ్ రావాల్సి ఉండగా వాయిదాలు పడటంతో 2014లో పిల్లా నువ్వు లేని జీవితం చిత్రం వచ్చింది. ఆ సినిమా వచ్చిన తర్వాత అంటే 2015లో రేయ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
ఇక సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా పరిచయం కాబోతున్నాడు. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ‘ఉప్పెన’ ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కాని కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడినది. ఇదే సమయంలో మరో సినిమాకు వైష్ణవ్ తేజ్ సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఉప్పెన విడుదల కాకుండానే మరో సినిమా పట్టాలెక్కి షూటింగ్ కూడా పూర్తి అయ్యేలా ఉంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఉప్పెన సినిమాను విడుదల చేసేందుకు ఇప్పట్లో పరిస్థితులు అనుకూలించేలా లేవు. థియేటర్లు ఎప్పటికి ఓపెన్ అవ్వనున్నాయి అనే విషయంపై క్లారిటీ లేదు. ఒక వేళ ఓపెన్ అయినా కూడా వెంటనే ప్రేక్షకులు వచ్చే విషయంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కనుక ఉప్పెన సినిమా ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. ఈలోపు వైష్ణవ్ తేజ్ మరో సినిమాను కూడా పూర్తి చేస్తాడేమో చూడాలి. పాపం మొదటి సినిమాకే ఇలాంటి పరిస్థితిని అన్నలాగే తమ్ముడు కూడా ఎదుర్కోవడం ఏంటో అంటూ మెగా ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
639112 957142Its rare knowledgeable folks within this topic, nevertheless, you seem like theres far more you are talking about! Thanks 544702
829651 188690cleaning supplies need to have earth friendly organic ingredients so that they do not harm the environment 903696