విశాఖలో విషవాయువు లీక్ బాధితుల్ని పరామర్శించేందుకు వైజాగ్ వెళ్లాలనుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు ఫలించలేదు. తాను విశాఖ వెళ్లేందుకు అనుమతించాలంటూ ప్రధాని కార్యాలయ ముఖ్య కార్యదర్శికి గురువారం ఉదయం బాబు లేఖ రాసినా అక్కడ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో ఆయన విశాఖ వెళ్లలేకపోయారు. లాక్ డౌన్ ప్రకటనకు ముందు హైదరాబాద్ వచ్చి అక్కడే ఉండిపోయిన చంద్రబాబు.. కరోనా నేపథ్యంలో సమీక్షలు, సమావేశాలు, ఎంపిక చేసిన మీడియా సంస్థల జర్నలిస్టులతో ఆన్ లైన్ ప్రెస్ మీట్లు పెడుతూ బిజీగా గడుపుతున్నారు.
అయితే, విశాఖలో గ్యాస్ లీక్ ప్రమాదం జరిగిందని తెలియగానే అక్కడకు వెళ్లి బాధితులను పరామర్శించాలని, ప్రభుత్వ చర్యలను సమీక్షించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఓ విమానం సమకూర్చుకున్నారు. అది ముంబైలో ఉంది. ఆ విమానం ముంబై నుంచి హైదరాబాద్ కు, అక్కడ నుంచి వైజాగ్ వెళ్లేందుకు, తిరిగి అదే విధంగా వెనక్కి వెళ్లేందుకు కేంద్రాన్ని అనుమతి కోరారు. కానీ సాయంత్రమైనా అక్కడ నుంచి ఎలాంటి జవాబూ రాలేదు. ఈలోగా స్థానిక పోలీసులు, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ సకాలంలో స్పందించి వందలాది మందిని రక్షించాయి. మరోవైపు సీఎం జగన్ అక్కడకు వెళ్లి వారిని పరామర్శించి, నష్టపరిహారం ప్రకటించడంతో విషయం కొంత చల్లారింది.
గతంలో రాజధానిగా విశాఖ వద్దు, అమరావతి మాత్రమే ఉండాలని బాబు గట్టిగా పట్టుబట్టి ఉండటంతో టీడీపీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా పార్టీతో విభేధించారు. అప్పటి నుంచీ వైజాగ్ వాసులు చంద్రబాబుపై ఆగ్రహంగా ఉన్నారనేది అందరికీ విదితమే. కానీ ఈ నేపథ్యంలో గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించేందుకు వెళ్లడం ద్వారా విశాఖ ప్రజల ఆదరాభిమానాలను తిరిగా పొందాలని బాబు భావించినట్టు తెలుస్తోంది. కానీ కేంద్రం నుంచి అందుకు అనుమతి రాకపోవడంతో బాబు వ్యూహం బెడిసికొట్టింది. కరోనా కారణంగా ఒకసారి మోదీ నుంచి కాల్ రాగానే అంతా సెట్ అయిపోయిందని భావించాడు కానీ బాబుకి కేంద్రం నుంచి నిరాశే మిగిలింది.
691759 983284I enjoy looking by means of and I conceive this site got some truly beneficial stuff on it! . 541920