దేశవ్యాప్తంగా కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా మూడు వేలకు పైగా కేసులు 103 మరణాలు సంభవించాయి. ఫలితంగా దేశంలో కరోనా కేసులు 56 వేలు దాటగా.. మరణాలు 1886కి చేరాయి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ, కేంద్రం ఇచ్చిన సడలింపులు ముప్పును మరింత పెంచేదిగా ఉన్నాయనే అభిప్రాయలు వినిపిస్తున్నాయి. ఈనెల 4 నుంచి మద్యం విక్రయాలకు కూడా కేంద్రం అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. పలు రాష్ట్రాల్లో అదే రోజున మద్యం షాపులు ఓపెన్ అయిపోయాయి.
తాజాగా వివిధ రంగాలకు కూడా సడలింపులు ఇవ్వడంతో లాక్ డౌన్ అనేది ఎక్కడా అమలుకావడంలేదు. మద్యం షాపుల ఓపెనింగుతో మొదలైన ఈ వ్యవహారం అంతకంతకూ ముదురుతోంది. పలు రంగాలకు ఇచ్చిన సడలింపులు కారణంగా శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో జనాలు భారీగా రోడ్డెక్కారు. హైదరాబాద్ లో రెడ్ జోన్ లో ఉన్నప్పటికీ, పలు వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. సాధారణ సెలవు రోజుల్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది.
అసలే కరోనా పరీక్షలు తక్కువగా జరుగుతున్న తెలంగాణలో ఈ పరిస్థితి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి హైదరాబాద్ లో లాక్ డౌన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ చెప్పినా.. ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలూ జరగడంలేదు. ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఏదో ఒక సాకుతో రోడ్డు మీదకు వస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో నమోదయ్యే కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనివే.
ఈ నేపథ్యంలో ఎంతో జాగ్రత్తతో ఉండాల్సిన తరుణంలో ప్రస్తుత పరిస్థితులు అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వమే పలు సడలింపులు ఇచ్చినందును పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం భారతదేశం చాలా కీలకమైన దశలో ఉందని.. కరోనా నియంత్రణకు అత్యంత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎవరికి వారు జాగ్రత్తలు పాటించడం తప్ప ప్రస్తుతం మరో మార్గం కనిపించడంలేదు. ఎంతో అవసరమైతే తప్ప బయటకు రావొద్దని పేర్కొంటున్నారు. ఒకవేళ వచ్చినా.. అన్ని జాగ్రత్తలూ పాటించాలని సూచిస్తున్నారు.
959595 331323Excellent site. Plenty of helpful information here. 141068
763416 93922I dugg some of you post as I thought they were extremely beneficial invaluable 964845