ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాటలోనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా పయనించబోతున్నారట.! ఏ విషయంలో.. అన్నదే కదా మీ డౌట్.! అసలు విషయమేంటంటే, లక్ష కోట్ల దోపిడీ.. అంటూ విమర్శల్ని, ఆరోపణల్ని, అభియోగాల్ని ఎదుర్కొంటున్నారు వైఎస్ జగన్ మోహన్రెడ్డి చాలాకాలంగా. ఇప్పుడు ఆ స్థాయిలోనే నారా చంద్రబాబునాయుడు కూడా అభియోగాలు మోపబడేలా వున్నాయి.
వైసీపీ నేత లక్ష్మిపార్వతి దాఖలు చేసిన పిటిషన్కి సంబంధించి చంద్రబాబు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ఏసీబీ కేసు ఇప్పటికే నమోదైన విషయం విదితమే. ఆ కేసు విచారణ జరుగుతోంది. ‘ఈ కేసులో చంద్రబాబు జైలుకి వెళ్ళడం ఖాయం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బల్లగుద్ది మరీ చెబుతోంది.
ఆ మాటకొస్తే, భారతీయ జనతా పార్టీ ఎప్పుడో ఈ విషయమై డెడ్లైన్ కూడా పెట్టేసింది. ‘2020 సంక్రాంతి తర్వాత ఏ క్షణాన అయినా చంద్రబాబు జైలుకు వెళ్ళొచ్చు..’ అంటూ దాదాపు ఏడాది క్రితమే సెలవిచ్చారు బీజేపీ ముఖ్య నేతలు. ఆ దిశగా పరిస్థితులు కనిపిస్తున్నట్లే భావించాలేమో.
లక్ష్మీ పార్వతి చేసిన ఫిర్యాదు మాత్రమే కాదు, తాజాగా అమరావతి భూముల వ్యవహారంపై నమోదవుతున్న కేసుల్లోనూ చంద్రబాబుకి తిప్పలు తప్పేలా కన్పించడంలేదు. అయితే, టీడీపీ వర్గాలు మాత్రం చంద్రబాబుని ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
వైసీపీ మాటలే నిజమైతే, బీజేపీ చెప్పిందే జరిగితే.. వైఎస్ జగన్ బాటలోనే చంద్రబాబు కూడా తీవ్రమైన అభియోగాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైఎస్ జగన్ మోహన్రెడ్డిని ‘మ్యాన్ ఫ్రైడే’ అంటున్నారంతా. మరి, చంద్రబాబు కోసం ఏ రోజుని కేటాయించాల్సి వస్తుందో ఏమో.!
239303 674746Really instructive and excellent bodily structure of subject matter, now thats user pleasant (:. 965212
67290 552031Thanks for this wonderful post! It has long been extremely helpful. I wish that youll carry on posting your wisdom with us. 587589