తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, అమరావతిని ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళామంటున్నారు. హార్వార్డ్ యూనివర్సిటీలో అమరావతిపై కేస్ స్టడీ చేశారంటున్నారు. ఏంటీ, ఇదంతా నిజమేనా.? అసలు అమరావతి ఎక్కడుంది.? దాని పరిస్థితి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలోంచి దిగిపోయే నాటికి ఎలా వుంది.? అని రాష్ట్ర ప్రజానీకం ఇప్పుడు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
చంద్రబాబు హయాంలో అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించిన మాట వాస్తవం. సీడ్ క్యాపిటల్ అనీ, నవ నగరాలనీ, తాత్కాలిక సచివాలయ ప్రాంగణమనీ.. కొన్ని భవనాల్ని నిర్మించిన మాట కూడా వాస్తవం. హైకోర్టు కూడా నిర్మితమయ్యింది.. అయితే, దాదాపుగా అన్నీ తాత్కాలికమే. శాశ్వత భవనాల నిర్మాణం అస్సలేమాత్రం ఓ కొలిక్కి రాలేదు. మెజార్టీ భవనాల నిర్మాణం కూడా ప్రారంభం కాలేదాయె. కానీ, ఏకంగా ‘బంగారు బాతుని’ తమ ప్రభుత్వం అందిస్తే, వైఎస్ జగన్ ప్రభుత్వం దాన్ని చంపేసిందంటున్నారు.
బంగారు బాతు కాకపోయినా, అమరావతి ప్రస్తుతానికి ఓ మామూలు బాతు లాంటిదే.. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయోమయంతో చంపేస్తున్న మాట కూడా వాస్తవమే. ఐదు నెలలు పూర్తవుతోంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసి. ఓ ముఖ్యమంత్రి, తాను పరిపాలిస్తున్న రాష్ట్ర రాజధాని విషయమై తమ ప్రభుత్వం నుంచే అయోమయం జనంలోకి వెళుతున్నప్పుడు స్పందించాలి కదా.? స్పందించడంలేదాయె.
ఐదేళ్ళు చిన్న విషయమేమీ కాదు.. అంతర్జాతీయ స్థాయి రాజధాని కాకపోయినా, ఓ మోస్తరు రాజధాని నిర్మాణం పూర్తవడానికి ఐదేళ్ళ సమయం చాలా చాలా ఎక్కువే. కానీ, చంద్రబాబు ఆ పని చేయలేదు. కానీ, ఐదు నెలల్లో అమరావతి అనే ఆలోచనని చెరిపేసేందుకు మాత్రం వైఎస్ జగన్ సర్కార్ ప్రయత్నించిన మాట వాస్తవం.
524311 56148I gotta bookmark this site it seems quite helpful . 250360