Switch to English

అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు జగన్‌.. కొత్తగా ఏం మారిందని.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

2014 ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.. 2019 ఎన్నికల్లో గెలిచి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అంతే తేడా. అంతకు మించి, రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒరిగింది గతంలోనూ ఏమీ లేదు.. ఇప్పుడూ కన్పించడంలేదు. ‘మేం ప్రత్యేక హోదా తెస్తాం..’ అని చంద్రబాబు హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచారు.. అదే హామీ ఇచ్చి వైఎస్‌ జగన్‌ కూడా ఎన్నికల్లో గెలిచారు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చిందా.? 2014 నుంచి 2019 వరకూ ‘చంద్రబాబుకి దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలి’ అని వైఎస్‌ జగన్‌ అల్టిమేటం జారీ చేశారు.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అసెంబ్లీని రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఇద్దరూ ఓ ఖచ్చితమైన రాజకీయ అవగాహనతో రాష్ట్ర ప్రజల్ని వంచిస్తున్నారా.? అన్న అనుమానం కలగక మానదు.

ప్రత్యేక హోదా తీసుకురావడం చంద్రబాబుకి చేతకాలదని విమర్శించిన వైఎస్‌ జగన్‌, ఎందుకు అదే ప్రత్యేక హోదా విషయంలో వైఫల్యం చెందుతున్నట్లు.? నిన్న చంద్రబాబు, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి 48 గంటల డెడ్‌లైన్‌ పెట్టారు. దానిపై వైసీపీ నేతలు స్పందిస్తూ, ‘మేమెందుకు రాజీనామా చేస్తాం.? ఐదేళ్ళు మాకు ప్రజలు అధికారం కట్టబెట్టారు కదా.!’ అంటూ బుకాయించేస్తున్నారు.

చంద్రబాబు ప్రభుత్వానికీ ఐదేళ్ళు పాలించమనే ప్రజలు అధికారం కట్టబెట్టారు. మరెందుకు చంద్రబాబు ప్రభుత్వం తప్పుకోవాలని వైఎస్‌ జగన్‌ విమర్శించినట్లు.? రాజకీయంగా చంద్రబాబు పనైపోయిందని రాష్ట్రంలో చిన్న పిల్లాడినడిగినా చెబుతాడు. కానీ, ఇప్పుడు ఆ చంద్రబాబుని ‘లేపేందుకు’ వైసీపీ ప్రయత్నిస్తోందా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి చాలామందికి.

‘అయితే మేం అధికారంలో వుండాలి.. మేం కాకపోతే మీరు అధికారంలో వుండాలి.. మధ్యలో ఇంకెవరికీ అవకాశం దక్కకూడదు’ అన్న కోణంలో టీడీపీ, వైసీపీ కలిసి ఓ పక్కా ప్రణాళికతో ‘కుమ్మకు రాజకీయాలు’ చేస్తున్నట్లే కన్పిస్తోంది.

ప్రత్యేక హోదా తీసుకురావడం చేతకాలేదు గనుక.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. రాజధాని అమరావతి విషయంలో మాట తప్పినందున, నైతికంగా ముఖ్యమంత్రి పదవిలో ఇంకా కొనసాగడానికి వైఎస్‌ జగన్‌ అనర్హుడన్న చర్చ రాష్ట్ర ప్రజల్లో జరుగుతోంది. కానీ, ప్రజలతో ఛీకొట్టించుకోవాలంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా వేచి చూడాల్సిందేనన్న ధోరణిలో బహుశా టీడీపీలానే వైసీపీ కూడా ఎదురుచూస్తుందేమో.? అని రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...