ఈమద్య కాలంలో చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. కరోనా కారణంగా కొందరు మృతి చెందగా మరికొందరు మాత్రం కరోనాను జయించారు. మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనాతో మృతి చెందారు. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే అయిన సున్నం రాజయ్య కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు అనుమానంతో కరోనా టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దాంతో వెంటనే ఆయన్ను భద్రాచలం నుండి విజయవాడ తరలిస్తూ ఉండగా మార్గ మద్యలోనే మృతి చెందారు.
గత కొన్నాళ్లుగా తూర్పు గోదావరి జిల్లా వర రామచంద్రపురం మండంలోని సున్నంవారిగూడెంలో ఆయన ఉంటున్నారు. ఇటీవలే ఆయన ఇద్దరు కొడుకులు మరియు అల్లుడికి కరోనా అంటూ నిర్థారణ అయ్యింది. వారి నుండి రాజయ్యకు కరోనా సోకి ఉంటుందని అంటున్నారు. కరోనా అంటూ నిర్థారణ అయిన వెంటనే రాజయ్యను విజయవాడకు తరలిస్తూ ఉండగా ఆయన మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 1999, 2004, 2014లో మూడు సార్లు సీపీఐ పార్టీ తరపున రాజయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఆయన చాలా సాదారణమైన జీవితాన్ని గడిపారు.
239445 300103I like this internet website because so a lot utile stuff on here : D. 173747