కేంద్ర మంత్రివర్గ విస్తరణకు వేళయింది. ఆగస్టు 15వ తేదీలోపే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కసరత్తు పూర్తిచేసి ప్రధాని మోదీకి అందజేసినట్టు సమాచారం. గతనెలలో ఆర్ఎస్ఎస్ నేత కృష్ణ గోపాల్.. నడ్డాతోపాటు ప్రధాని మోదీని కలిశారు. దీంతో అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. కేబినెట్ విస్తరణకు సంబంధించి చర్చించేందుకే ఆ భేటీలు సాగినట్టు వార్తలొచ్చాయి.
నిజానికి కరోనా మహమ్మారి రాకపోయి ఉంటే ఈ పాటికే మంత్రిమండలి విస్తరణ జరిగి ఉండేది. నిబంధనల ప్రకారం కేంద్రంలో 81 మంది మంత్రులు ఉండొచ్చు. అయితే, జంబో కేబినెట్ వద్దనుకున్న మోదీ.. 57 మందితో సరిపెట్టారు. ఇది గత ఎన్డీఏ కేబినెట్ కంటే 13 మంది తక్కువ. అయితే, ప్రస్తుత ఎన్డీఏ సర్కారుకు ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో కేబినెట్ విస్తరించాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. అయితే పూర్తి స్థాయి జంబో కేబినెట్ కాకుండా గత ఎన్డీఏ ప్రభుత్వం తరహాలోనే కేబినెట్ ఉండే అవకాశం ఉంది.
మరో పది లేదా 12 మందికి మాత్రమే అవకాశం వస్తుందని అంటున్నారు. ఇందులో ప్రధానంగా మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కారును కూల్చి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు అమాత్య పదవి ఖాయమని చెబుతున్నారు. ఇటీవలే ఆయన్ను రాజ్యసభకు పంపించింది అందుకే అని అంటున్నారు. అలాగే బీజేపీ రాజ్యసభ సభ్యులు భూపేంద్ర యాదవ్, అనిల్ జైన్, అనిల్ బాలుని పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇక త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షం జనతాదళ్ కు ఓ పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి రెండు మూడు పేర్లు వినిపిస్తున్నాయి.
నిజానికి యూపీఏ హయాంతో పోలిస్తే ఎన్డీఏ హయాంలో తెలుగు రాష్ట్రాలకు కేంద్రంలో పెద్దగా ప్రాధాన్యత లభించలేదు. తెలంగాణ నుంచి కేవలం కిషన్ రెడ్డి ఒక్కరికే మంత్రి పదవి లభించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అసలు ప్రాతినిధ్యమే లేదు. తెలుగు రాష్ట్రాల్లో బలం పుంజుకోవాలని భావిస్తున్న కమలనాథులు ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఒకరిద్దరికి అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాష్ట్రం నుంచి మరో పదవి ఇవ్వాలనుకుంటే బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లలో ఒకరికి ఛాన్స్ రావొచ్చని సమాచారం.
ఇక ఏపీ నుంచి ప్రస్తుతం ఒక్కరు కూడా కేంద్ర కేబినెట్ లో లేరు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి రాంమాధవ్ కు అవకాశం లభించొచ్చని అంటున్నారు. అలాగే దగ్గుబాటి పురంధేశ్వరిని కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ వీరిలో ఎవరికి అవకాశం ఇచ్చినా ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇదంతా ఎందుకు అనుకుంటే టీడీపీ నుంచి బీజేపీకి వెళ్లిన సుజనా లేదా సీఎం రమేశ్ లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి మరో వారం రోజుల్లోనే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుత మంత్రివర్గం ఒకరు లేదా ఇద్దరిని తప్పించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
145844 986635When I originally commented I clicked the -Notify me when new feedback are added- checkbox and now every time a remark is added I get four emails with the same comment. Is there any approach youll be able to remove me from that service? Thanks! 927573
426440 605374Woh I like your content , saved to bookmarks ! . 328310
236941 87263Yay google is my world beater aided me to discover this outstanding web site! . 581467
966569 38424We will have a hyperlink trade agreement among us! 650373
335330 96971This really is sensible info! Where else will if ind out more?? Who runs this joint too? sustain the excellent function 779058