Switch to English

ఏపీకి కేంద్రం డబుల్ షాక్: పోర్టు రాదు, ప్లాంటు ప్రైవేటీకరణ ఆగదు!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి డబుల్ షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రానికి సంబంధించి అతి ముఖ్యమైన రెండు విషయాలపై ఒకేసారి స్పష్టత ఇస్తూ, రెండు చెంపలూ పగలగొట్టేసింది మోడీ సర్కార్. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు చేష్టలుడిగి చూస్తోన్న వేళ, వెకిలి రాజకీయాలు చేస్తున్న వేళ.. కేంద్రం తన పని తాను చేసుకుపోయింది.. రాష్ట్రానికి అన్యాయం చేసే క్రమంలో.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆగే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు పరిశ్రమ నుంచి 100 శాతం ప్రభుత్వ పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుంటామని, ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే సమాచారం ఇచ్చామనీ కేంద్రం అంటోంది. లోక్‌సభలో రాష్ట్ర ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్రంపై పెద్ద పిడుగు పడేశారు.

మరోపక్క, రాష్ట్రానికి విభజన చట్టం ద్వారా దక్కాల్సిన పోర్టు విషయంలోనూ షాక్ తగిలింది. దుగరాజపట్నంకి బదులుగా రామాయపట్నం మేజర్ పోర్టు విషయమై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. అయితే, రామాయపట్నం మేజర్ పోర్టు స్థాయిని తగ్గిస్తూ నాన్ మేజర్ పోర్టుగా పేర్కొంటూ గత ఏడాది రాష్ట్రప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విషయాన్ని పేర్కొంటూ, నాన్ మేజర్ పోర్టుతో కేంద్రానికి సంబంధం లేదని తేల్చేసింది. ఒకవేళ నాన్ మేజర్ పోర్టుకి సహకారం అందించాలంటే, విభజన చట్టంలో మార్పులు చేయాల్సి వుంటుందని కేంద్రం ప్రకటించడం కొసమెరుపు.

ప్రత్యేక హోదా రాలేదాయె.. కడపలో ఏర్పాటు చేయాల్సిన స్టీలు ప్లాంటు ఊసు లేదాయె. పోలవరం ప్రాజెక్టు విషయంలో గందరగోళం కొనసాగుతోందాయె. రాజధాని అధోగతిపాలాయె.! ఇవన్నీ చాలవన్నట్టు పోర్టు అటకెక్కింది.. వున్న ఉక్కు పరిశ్రమ కూడా ప్రైవేటు చేతుల్లోకి వెళ్ళిపోతోంది. టీడీపీ – వైసీపీ.. విశాఖ వేదికగా రాజకీయ యుద్ధానికి తెరలేపడం తప్ప.. కలిసికట్టుగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్న సోయ ప్రదర్శించకపోవడం రాష్ట్రానికి శాపంగా పెను మారింది.

ఇదిప్పటి తంతు కాదు, 2014 నుంచీ ఇదే వ్యవహారం నడుస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో కూడా వైసీపీ – టీడీపీ మధ్య గలాటా జరిగింది తప్ప.. రెండూ పార్టీలూ కేంద్రాన్ని నిలదీయలేకపోయాయి. మొత్తమ్మీద, విభజన తర్వాత కష్టనష్టాలపాలైన రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన కేంద్రం, రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఆధిపత్య పోరుతో చోద్యం చూస్తోంది తప్ప, రాష్ట్రానికి సహకరించాలన్న విజ్ఞతను కోల్పోయిందన్నమాట.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...