Switch to English

విశాఖ ఉక్కుపై రాష్ట్రానికి హక్కులేదు: తేల్చేసిన సీఎం జగన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు.. అనేది ఒకప్పటి నినాదం. ఇప్పుడూ అదే నినాదంతో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతోంది. అయితే, విశాఖ ఉక్కుపై రాష్ట్రానికి హక్కు లేదని తేల్చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. విశాఖ పర్యటనలో భాగంగా విశాఖ ఉక్కు పరిశ్రమకు చెందిన కార్మిక సంఘాల ప్రతినిథులతో భేటీ అయిన వైఎస్ జగన్, విశాఖ ఉక్కు పరిశ్రమపై రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై సర్వ హక్కులూ కేంద్రానికే వున్నాయనీ, నష్టాల్లో వుందని చెప్పి కేంద్రం ఈ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలనుకోవడం తగదని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి ఇప్పటికే ఈ విషయమై లేఖ రాశానన్న వైఎస్ జగన్, విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంతంగా గనులు లేవనీ, నష్టాలను తగ్గించుకునే మార్గాల్ని అన్వేషించాలి తప్ప, ప్రైవేటీకరణ చేయకూడదనే విషయాన్ని కేంద్రానికి తెలిపానన్నారు. కాగా, విశాఖ స్టీలు ప్లాంటుపై కన్నేసిన ‘పోస్కో’ సంస్థ ప్రతినిథులు తనను గతంలో కలిసిన మాట వాస్తవమేనని వైఎస్ జగన్ చెప్పారు. కడప, కృష్ణపట్నం, భావనపాడుల్లో ఏదో ఒక చోట స్టీలు ప్లాంటు ఏర్పాటు గురించి మాత్రమే తమ మధ్య చర్చలు జరిగాయనీ, కడపలో స్టీలు ప్లాంటు ఏర్పాటు చేస్తే బావుంటుందని తాను వారికి సూచించాననీ, విశాఖ ఉక్కు పరిశ్రమ జోలికి పోస్కో వచ్చే అవకాశం లేదని వైఎస్ జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం.

అయితే, విశాఖ ఉక్కు పరిశ్రమకు చెందిన భూముల్లో స్టీలు ప్లాంటు నెలకొల్పేందుకు పోస్కో ఇప్పటికే అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెల్సిందే. అదే పోస్కో సంస్థకు విశాఖ స్టీలు ప్లాంటుని అప్పగించేందుకూ కేంద్రం సుముఖంగానే వుంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ఇప్పటికే కేంద్రం ప్రకటన చేయడం, పలు దఫాలుగా పోస్కో కేంద్రంతోనూ, విశాఖ ఉక్కు యాజమాన్యంతోనూ సంప్రదింపులు చేపట్టడం… ఇవన్నీ జరిగాక, కేంద్రం వెనక్కి తగ్గుతుందని ఎలా అనుకోగలం.? ఏదిఏమైనా, రాజకీయాల్ని పక్కన పెట్టి.. అన్ని రాజకీయ పార్టీలూ విశాఖ ఉక్కు ఉద్యమంలోకి ఉక్కు సంకల్పంతోనే రావాల్సి వుంటుంది. వైసీపీ, టీడీపీ.. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటే ఆ ఆధిపత్య పోరు విశాఖకు, ఆంధ్రపదేశ్‌కీ తీవ్ర నష్టం చేస్తుందన్నది నిర్వివాదాంశం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...