మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి విచారణను సీబీఐ వేగవంతం చేసింది. గత కొంది రోజులుగా ఈ కేసులో పలువుర్ని విచారించిన సీబీఐ, తాజాగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని విచారణకు పిలిచింది. శివశంకర్రెడ్డి, వైఎస్ జగన్ మోహన్రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెబుతున్నారు. పులివెందులకు చెందిన శివశంకర్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి కూడా అత్యంత సన్నిహితుడు. తన తండ్రి మరణానికి సంబంధించి పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తూ, వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు సమర్పించిన 15 మంది అనుమానితుల లిస్ట్లో దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి పేరు కూడా వుండడం గమనార్హం.
శివశంకర్ రెడ్డి, వివేకా హత్య జరిగిన రోజు సంఘటనా స్థలంలో వైఎస్ కుటుంబ సభ్యులతోపాటు వున్నారు. సాక్ష్యాల తారుమారుకి సంబంధించి దేవిరెడ్డి శివశంకర్రెడ్డిపైనా ఆరోపణలు వుండడంతో, ఈ కేసులో ఆయన్ని విచారించడం ద్వారా కీలక అంశాలు వెలుగు చూస్తాయన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. గతంలో ఈ కేసు విచారణ నిమిత్తం ఏర్పాటైన సిట్ కూడా దేవిరెడ్డి శివశంకర్ని పలు మార్లు విచారించడం గమనార్హం.
కాగా, ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సహా పలువుర్ని సీబీఐ విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో టీడీపీ మాజీ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి కూడా వుంది. వైఎస్ వివేకా హత్య వెనుక ఆదినారాయణరెడ్డి హస్తం వుందంటూ అప్పట్లో వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం విదితమే. మొత్తమ్మీద, వైఎస్ వివేకా హత్య చుట్టూ 2019 ఎన్నికల సమయంలో నానా రకాల రాజకీయాలూ నడిచాయి. ఆ ఎన్నికలపై వైఎస్ వివేకా హత్య ఎఫెక్ట్ గట్టిగానే పడిందనుకోండి.. అది వేరే విషయం.
ఏదిఏమైనా, ఏడాది తర్వాత కూడా వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి ‘వాస్తవాలు’ వెలుగులోకి రాకపోవడం దురదృష్టకరం. సీబీఐ విచారణతో అయినా, అసలు దోషులెవరో తేలుతుందేమో వేచి చూడాలి.
8707 70079Id forever want to be update on new posts on this web site , bookmarked ! . 854715
452820 516424Basically a smiling visitor here to share the love (:, btw great pattern . 670027
903474 477261Can anyone help me out? It will be much appreciated. 296200
383826 716447Deference to op , some superb selective information . 657177