మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో సునీల్ యాదవ్ ను అరెస్టు చేసిన సీబీఐ మరొక నిందితుడిని అరెస్టు చేసింది. వివేకా పొలం పనులు చూసే జగదీశ్వర్ రెడ్డి సోదరుడు అయిన ఉమాశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.
సింహాద్రిపురం మండలం కుంచేకుల గ్రామానికి చెందిన ఉమాశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు ఉదయం నుంచీ విచారించి సాయంత్రం అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. ఉమాశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఉమాశంకర్ రెడ్డికి ఈనెల 23 వరకూ రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను పులివెందుల నుంచి కడప జిల్లా జైలుకు తరలించారు.
661182 136676Oh my goodness! a fantastic post dude. Thank you Even so I is going to be experiencing concern with ur rss . Dont know why Can not subscribe to it. Will there be any person finding identical rss difficulty? Anybody who knows kindly respond. Thnkx 982748