దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. ఈ సమయంలో చిన్న చిన్న పార్టీలు కూడా వద్దంటూ ప్రభుత్వం సూచిస్తుంది. ఎక్కడ కూడా పదుల సంఖ్యలో జనాలు గుమ్మి కూడవద్దు అంటూ సూచిస్తున్నారు. అయినా కూడా కొందరు జనాలు మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా బీహార్లో పాట్నా సమీపంలోని పాలీగంజ్ కు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి వివాహం భారీగా అయ్యింది. పెళ్లికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. పెళ్లి దగ్గర పడ్డ సమయంలో వరుడు అనారోగ్యంతో హాస్పిటల్లో చేరాడు. డయేరియాగా భావించారు. పెళ్లి దగ్గరకు వచ్చిన సమయంలో అనారోగ్యంతోనే పెళ్లికి సిద్దం అయ్యాడు.
అనారోగ్య విషయంను బయటకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన రెండు రోజులకు అనారోగ్యం తీవ్రమై ఏకంగా అతడు మృతి చెందాడు. విషయంను ఒక వ్యక్తి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లడంతో అధికారులు రంగంలోకి దిగారు. అప్పటికే వరుడి అంత్యక్రియలు జరపడంతో అతడికి కరోనా ఉందా లేదా అనేది తెలియలేదు. అయితే ఖచ్చితంగా అతడు కరోనాతో బాధపడుతున్నాడు అనే అనుమానంతో కొందరికి టెస్టు నిర్వహించగా వారికి పాజిటివ్ వచ్చింది. ఇప్పటి వరకు ఆ పెళ్లి కారణంగా 132 మందికి వైరస్ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఈ సంఖ్య దాదాపుగా 500 వరకు పెరిగే అవకాశం లేకపోలేదు అంటున్నారు.
961467 825335You created some respectable points there. I looked on the internet for the problem and discovered a lot of people will go along with with your website. 569936
837144 591619Thanks for the auspicious writeup. It actually used to be a leisure account it. Glance complicated to a lot more delivered agreeable from you! Nonetheless, how can we be in contact? 133717