దసరా సీజన్ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద టాలీవుడ్ బిగ్ ఫిలిమ్స్ ఏవీ లేకపోవడం వలన డబ్బింగ్ సినిమాలు, డైరెక్ట్ స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ శుక్రవారాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఈ వారం కూడా పెద్ద హీరోల సినిమాలు లేవు కానీ మంచి బజ్ క్రియేట్ చేసుకున్న రెండు స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్నాయి. అవే విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తరుణ్ భాస్కర్ ని హీరోగా చేసిన కామెడీ ఎంటర్టైనర్ ‘మీకు మాత్రమే చెప్తా’ మరియు డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రవిబాబు డైరెక్ట్ చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఆవిరి’. ఈ రెండు సినిమాలు రేపు అనగా నవంబర్ 1న రిలీజ్ కానున్నాయి.
ఒక్కో సినిమా ప్రకారం ఈ సినిమాలకి ఉన్న క్రేజ్ ని బట్టి మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రేంజ్ ఎలా ఉంటుందనేది మీకోసం..
మీకు మాత్రమే చెప్తా’ – విజయ్ దేవరకొండ అనే బిగ్ టాగ్ లైన్ ఈ సినిమాకి కావాల్సినంత హైప్ వచ్చింది, అలాగే అనుకున్న దానికంటే ఎక్కువ థియేటర్స్ లో సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా యూత్ లో ఈ సినిమాని చూడాలనే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా మొదటి రోజు 80 లక్షల నుండి ఒక కోటి రూపాయల వరకు షేర్ కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అలాగే సినిమాలో అన్నీ వర్కౌట్ అయ్యి సూపర్ హిట్ టాక్ వస్తే నెక్స్ట్ డే నుంచి కలెక్షన్స్ ఇంకా పెరుగుతాయని. అలా పెరిగితే మొదటి 3 రోజుల్లోనే ఈ సినిమా బడ్జెట్ మొత్తం రికవర్ అవుతుందని అంటున్నారు.
‘ఆవిరి’ – రవిబాబు సినిమాలకు ఎక్కువగా ఏ సెంటర్, మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు. అలాగే ‘అవును’ సీరీస్ విజయం వలన రవిబాబు చేసే హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ మీద నమ్మకం ఉంది. అదీ కాకుండా ఈ సినిమాని దిల్ రాజు ఇరు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. అందుకే ఎక్కువ థియేటర్స్ లోనే రిలీజ్ అవుతోంది. ఈ కారణముగా ‘ఆవిరి’ సినిమా మొదటి రోజు 40-50 లక్షల షేర్ రిజిష్టర్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ సినిమా పాజిటివ్ మౌత్ టాక్ సినిమా ప్రాఫిట్స్ కి హెల్ప్ అవుతుంది, లేదంటే లాభాలు కష్టం అంటున్నారు.