Switch to English

వైఎస్ వద్దంది.. జగన్ కు ముద్దైంది!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ లో మీడియాను ఆంక్షల చట్టంలో బిగించే జీవో వచ్చేసింది. నాడు వైఎస్ వద్దన్న జీవోను నేడు ఆయన తనయుడు జగన్ తెచ్చేశారు. ఇకపై ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్.. మీడియా ఏదైనా సరే, ఆధారాలు లేకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాస్తే కేసులు నమోదు కానున్నాయి. ఈ మేరకు ఆయా శాఖల కార్యదర్శులకు అధికారాలను కట్టబెడుతూ ఏపీలోని వైఎస్సార్ సీపీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది.

ఈ విషయంలో ప్రతిపక్షాల విమర్శలను సైతం ఖాతరు చేయకుండా జగన్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో ఇకపై ఎలాంటి ఆధారాలు లేకుండా పత్రికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించినా, టీవీల్లో కథనాలు ప్రసారం చేసినా, సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టినా.. బాధ్యులపై ఆయా శాఖల కార్యదర్శులు నేరుగా కేసులు పెట్టే అవకాశం లభిస్తుంది. ఇప్పటివరకు ఈ అధికారం కేవలం ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ కు మాత్రమే ఉండేది. తాజాగా వివిధ శాఖల కార్యదర్శులకు ఈ అధికారం లభించింది.

2007లో ఇలాంటి జీవోనే అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చారు. అయితే, దీనిపై విపక్షాలు రాద్దాంతం చేయడం.. జర్నలిస్టు సంఘాలు కూడా వ్యతిరేకించడం.. వైఎస్ సన్నిహితులు సైతం ఈ విషయంలో విముఖత ప్రదర్శించడంతో రాజశేఖర్ రెడ్డి వెనక్కి తగ్గారు. ఆ జీవో ఎవరి స్థాయిలో వచ్చిందో, ఎవరు నిర్ణయం తీసుకున్నారో తెలియదని, అది అవసరం లేని జీవో అని చెప్పి ఉపసంహరించుకున్నారు. అప్పటితో ఆ సమస్య సమసిపోయింది. ఇప్పుడు అలాంటి జీవోకే మరింత పదును పెట్టి జగన్ తీసుకొచ్చారు.

అయితే, ఏది ప్రభుత్వ వ్యతిరేక వార్త? ఏది అనుకూల వార్త అన్నది ఎలా నిర్ణయిస్తారో ఇంకా క్లారిటీ లేదు. ఫలానా శాఖలో అవినీతి జరుగుతోందని కథనం వస్తే, సదరు శాఖ కార్యదర్శి దానిని విచారించడం మానేసి ఇది ప్రభుత్వ వ్యతిరేక వార్త అని కేసు పెడితే ప్రయోజనం ఏముంటుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో పూర్తిస్థాయి మార్గదర్శకాలు విడుదలైతేనే కాస్త స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...