ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్య చిచ్చు రగిలింది. ఈసారి ‘చిచ్చు’ రాజేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిని విమర్శించే క్రమంలో ‘ఆయన జాతీయ నాయకుడు స్థాయి నుంచి జాతి నాయకుడి స్థాయికి పడిపోయారు..’ అంటూ విజయసాయి రెడ్డి విమర్శించిన విషయం విదితమే.
ఇక్కడ, ‘జాతి’ అనే అంశం చుట్టూ చాలా పెద్ద చర్చ జరుగుతోంది. ‘అవును, చంద్రబాబు తెలుగు జాతి ఆత్మగౌరవానికి నిదర్శనం. తెలుగు జాతి తరఫున ఇప్పుడు ఆయన ఒకే ఒక్క పవర్ ఫుల్ లీడర్..’ అని తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పుకున్నారు. మరోపక్క, చంద్రబాబుని ‘కమ్మ’ జాతి నాయకుడిగా విజయసాయిరెడ్డి అభివర్ణించడం పట్ల, ‘రెడ్డి’ సామాజిక వర్గం ఓ వైపు పండగ చేసుకుంటోంది. తద్వారా చంద్రబాబుని కేవలం ఓ జాతికి పరిమితం చేశారన్నది వైసీపీలో కొందరు నేతల వాదన.
కానీ, సాధారణ ప్రజానీకానికి మాత్రం ఇంకో ‘సంకేతం’ వెళ్ళింది. మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఈ వ్యాఖ్యల్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లే కన్పిస్తోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పదే పదే ‘మా జాతి’ అంటుంటారు. అలా కాపు సామాజిక వర్గంపై ‘జాతి’ ప్రభావం చాలా ఎక్కువ. ‘జాతి’ అనే పదాన్ని విజయసాయిరెడ్డి వెటకారంగా ఉపయోగించడాన్ని కాపు సామాజిక వర్గ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
‘కమ్మ ముఖ్యమంత్రిని చూశాం.. రెడ్డి ముఖ్యమంత్రిని చూస్తున్నాం.. అందరూ కాపు సామాజిక వర్గం అండదండలతో ఎదిగినవారే.. కాపు సామాజిక వర్గాన్ని అణగదొక్కుతున్నవారే..’ అంటూ తాజా పరిణామాలపై కాపు సామాజిక వర్గంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిజానికి, ఇటీవలి ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు దృష్టి సారిస్తే.. తెలివిగా టీడీపీ, వైసీపీ.. ఆ సామాజిక వర్గం ఓట్లను చీల్చగలిగాయి.
ఈ నేపథ్యంలోనే, కాపుల ఐక్యత కోసం తెరవెనుక మంత్రాంగం గట్టిగా సాగుతోంది. ‘కాపు జాతి సత్తా చూపిస్తాం.. ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకుంటాం..’ అంటూ జనసేన వైపుగా కాపు సామాజిక వర్గ ముఖ్య నేతలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు హయాంలో కాపులకు ఇచ్చిన రిజర్వేషన్లను వైఎస్ జగన్ సర్కార్ అమలు చేయకపోవడం కూడా కాపు సమాజిక వర్గంలో ఈ కదలికకు కారణంగా చెప్పుకోవచ్చేమో.!
35928 674413Fantastic post will likely be linking this on several internet sites of mine keep up the good work. 193474