రాష్ట్ర రాజధాని విశాఖకు తరలి వెళ్లడం ఖాయమని.. ఏ క్షణానైనా పరిపాలనను విశాఖకు తరలిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజమండ్రిలో పర్యటించిన ఆయన రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అవకాశాలను గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు దుర్వినియోగం చేశారన్నారు. ఏపీ అభివృద్ధి కోసం మూడు రాజధానులు మా ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు. ఈ విషయంలో కోర్టును ఒప్పించి, వాస్తవాలు చెబుతామన్నారు. సమస్యలు అధిగమించి 3 రాజధానులు ఏర్పాటు చేసి తీరతామని అన్నారు.
ప్రస్తుతం ఆ ప్రక్రియలోనే ఉన్నామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. త్వరలోనే 32 పురపాలికలు, 3 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. విలీన గ్రామాలను కలిపి రాజమహేంద్రవరం నగరపాలికకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. రాజమహేంద్రవరంను మోడల్ నగరంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
720161 531853A truly interesting examine, I could not concur entirely, but you do make some very valid points. 122078
232800 368576Greetings! This is my first comment here so I just wanted to give a quick shout out and let you know I genuinely enjoy reading by means of your weblog posts. Can you recommend any other blogs/websites/forums that deal with the same topics? Thank you so considerably! 69667
721802 312084Outstanding post, I conceive individuals really should larn a good deal from this internet website its really user genial . 83508