కరోనా వైరస్కి సంబంధించి సమాచారాన్ని కోరితే ఇచ్చేవాళ్ళమంటూ సీఎస్ నీలం సాహ్నీ, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్కుమార్కి లేఖ రాశారు. ప్రపంచం కరోనా వైరస్ని మహమ్మారిగా భావిస్తున్న వేళ, భారత ప్రభుత్వం కూడా ‘జాతీయ విపత్తు’గా ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కేంద్ర స్థాయిలో సంప్రదింపులు జరిపాకనే, రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ నిన్న ప్రకటించారు.
దాంతో, రాజకీయ దుమారం రేగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్పై విరుచుకుపడ్డారు. ‘కులం ముద్ర’ కూడా వేసేశారు. ఇంతలోనే, సీఎస్ నుంచి, ఎస్ఈసీకి లేఖ వెళ్ళింది. కరోనా వైరస్ విషయమై ఎవరితోనూ సంప్రదించకుండా నిర్ణయం తీసేసుకుని, స్థానిక ఎన్నికల ప్రక్రియను నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిలిపివేశారన్నది రాష్ట్రంలో అధికార పార్టీ వాదన. దానికి తగ్గట్టుగానే సీఎస్ నుంచి ఎస్ఈసీకి రిప్లయ్ వచ్చింది.
గతంలో, అంటే 2019 ఎన్నికల సమయంలో ఏబీ వెంకటేశ్వరరావుని ఎన్నికల విధుల నుంచి తప్పించే విషయమై అప్పటి సీఎస్ అనిల్ చంద్ర పునేఠా, ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకున్నందుకు.. ఆయన కూడా ‘వేటు’ ఎదుర్కోవాల్సి వచ్చిన విషయాన్ని రాజకీయ పరిశీలకులు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు.
ఏదిఏమైనా, కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా వుంది. అగ్ర రాజ్యం అమెరికా సైతం చిగురుటాకులా వణుకుతోందన్నది నిర్వివాదాంశం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, మొండితనానికి పోతే, అది ప్రజల ప్రాణాలకు పెను ముప్పుగా పరిణమిస్తుంది. ‘ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది..’ అని ప్రభుత్వం వివరించడం బాగానే వున్నా, వైరస్ తీవ్రతని దృష్టిలో పెట్టుకోవాల్సి వుంది.
వైరస్ వ్యాప్తిని ముందే నివారించకపోతే, తర్వాత జరిగే నష్టం ఎలా వుంటుందో చైనా, ఇటలీ, ఇరాన్, స్పెయిన్ దేశాల్ని చూస్తే అర్థమవుతుంది. ప్రజారోగ్యం కంటే, అధికార పార్టీకి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమైతే ఎలా.?
385570 901015Hello Guru, what entice you to post an article. This write-up was really intriguing, specifically since I was looking for thoughts on this subject last Thursday. 429671
995171 555723Im having a small dilemma. Im unable to subscribe to your rss feed for some reason. Im utilizing google reader by the way. 396337