నిన్నటి నుంచి ఎన్నికల కమిషర్ నిమ్మగడ్డ రమేష్ కు జగన్ సర్కార్ కు మధ్య డీ అంటే డీ అనే విధంగా మాటల యుద్ధం జరుగుతున్నది. కేంద్రం నుంచి వచ్చిన సూచనల విశ్లేషించుకుని స్థానిక ఎన్నికలను వాయిదా వేసినట్టుగా ఎన్నికల కమిషనర్ నిన్న సాయంత్రం క్లారిటీ ఇచ్చారు. కరోనా ప్రభావం ప్రపంచంలో తీవ్రంగా ఉందని, కరోనా వలన ప్రపంచం మొత్తం వణికిపోతోందని వార్తలు వస్తున్నాయి. ఇక ఇండియాలో కూడా కరోనా ప్రభావం దారుణంగా ఉన్నది.
కరోనా వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భయం చెందుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలని చెప్పి భారత ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. నోటిఫైడ్ నేషనల్ డిజాస్టర్ గా కరోనాను గుర్తించింది. ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాల్లో వ్యాపించింది. జనసమూహం లేకుండా చూడాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలు నిర్వహిస్తే జనాలు సమూహంగా ఉంటారు. ఎన్నికల ప్రచారం, కోలాహలం ఉంటుంది.
ఇలాంటి సమయంలో కరోనా ఉన్న వ్యక్తిని ఎవరైనా కలిస్తే పరిస్థితి ఏంటి. ఎలా మారిపోతుంది. సిట్యుయేషన్ ఎంత తీవ్రంగా ఉంటుంది అనే విషయాలు అర్ధం చేసుకోవాలి. ఇదంతా అలోచించి ఎన్నికల కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు.
అయితే, ఎన్నికల కమిషనర్ ను చంద్రబాబు నాయుడు హయంలో నియమించారని, దానికి కృతజ్ఞతగా ఇప్పుడు ఎన్నికలు పోస్ట్ ఫోన్ చేశారని వైకాపా నేతలు, మంత్రులు చివరకు సీఎం కూడా వ్యాఖ్యానించడం విడ్డూరంగా మారింది. ఎన్నికల కమిషన్ అన్నది ఓ స్వతంత్ర సంస్థ. అందులో రాజకీయాలకు తావుండదు. రాజ్యాంగ బద్దంగా నడుస్తుంది. ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వానికే కాకుండా, ఇలాంటి స్వతంత్రమైన రాజ్యాంగబద్ధమైన సంస్థలకు కూడా కొన్ని అధికారాలు ఉంటాయి.
వాటిని ఇటువంటి సమయంలో వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయం ముఖ్యమంత్రికి తెలియదా? తెలిసి కూడా ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేసి తనను తాను తక్కువ చేసుకున్నారు. ఎన్నికలు పోస్ట్ ఫోన్ చేసినందుకు వివరణ అడిగితె సరిపోయేది. దానికోసం ఏకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విమర్శలు చేయడం వలన ఏమైనా ఫలితం ఉన్నదా? ఇప్పుడు దేశంలో అందరిమనుకుంటున్నారు.. ఏపీకి ప్రజలకంటే, ప్రజల ప్రాణాల కంటే కూడా ఎన్నికలే ముఖ్యం.
కరోనా వ్యాపించకుండా ఉండేందుకు ఎన్నికలు వాయిదా వేశామని చెప్పినా దాన్ని తప్పుపట్టి ఇలా గొడవ చేస్తున్నారు అనే టాక్ వచ్చింది. పైగా కరోనా పాజిటివ్ కేసు ఒక్కటే ఉందని, దానికి ట్రీట్మెంట్ ఇస్తున్నామని చెప్తూనే, ఇలాంటి వైరస్ లకు పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని చెప్పి తన పరువును తానే తీసుకున్నారు.
పారాసిటమాల్ వేసుకునే దానికి ప్రపంచదేశాలు ఎందుకు కరోనాకు మందు కనిపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయి అని నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. 60 ఏళ్ళు దాటిన వ్యక్తులే చనిపోతారు అంటే, వుహాన్ నగరంలో సరిగా 40 కూడా లేని చాలామంది వైరస్ బారిన పడి మరణించారు. అందులో వైద్యులు కూడా ఉన్నారు. మరి దీని గురించి ఏమనాలి.
146835 748904Right after study a few of the weblog posts on your own website now, we really like your way of blogging. I bookmarked it to my bookmark internet web site list and are checking back soon. Pls consider my web-site likewise and make me aware in the event you agree. 819464
823621 814334Precisely what I was searching for, thankyou for putting up. 863929
838859 60020Over and more than again I like to consider this difficulties. As a matter of fact it wasnt even a month ago that I thought about this really thing. To be honest, what is the answer though? 476056