Switch to English

బిగ్‌ బ్రేకింగ్‌: ఏపీలో 3 క్యాపిటల్స్‌కి గవర్నర్‌ ఆమోదం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, మూడు రాజధానుల బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. మూడు రాజధానుల బిల్లుతోపాటు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుకీ గవర్నర్‌ ఆమోదం తెలిపారు. రాజధాని అమరావతిలోనే కొనసాగాలన్న డిమాండ్‌ ఓ వైపు, కాదు కాదు.. మూడు రాజధానులు వుండాల్సిందేనన్న ప్రభుత్వ ఆలోచన ఇంకో వైపు.. వెరసి దాదాపు ఏడెమినిది నెలలుగా రాష్ట్రంలో తీవ్ర గందరగోళం నెలకొంది. రెండొందల రోజులకు పైగా అమరావతిలో రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నా, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆ ఆందోళనల్ని లైట్‌ తీసుకుంది.

విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా, కర్నూలుని న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా ఏర్పాటు చేసేలా శాసన సభలో ‘అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు’తోపాటు, సీఆర్డీయే రద్దు బిల్లుని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం విదితమే. శాసన మండలిలో ఈ బిల్లులకు ప్రతిపక్షం టీడీపీ మోకాలడ్డంతో, మరోమారు శాసన సభలో ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టి ఆమోదించుకుంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. అనంతరం బిల్లులు, శాసన మండలికి మళ్ళీ వెళ్ళగా.. అక్కడా మరోసారి గందరగోళం ఏర్పడింది.

నిబంధనల ప్రకారం నెల రోజుల తర్వాత ఆ బిల్లులకు శాసన ఆమోదం లభించినట్లుగా భావించి, వాటిని గవర్నర్‌ ఆమోదం కోసం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పంపింది. గవర్నర్‌ ఈ బిల్లులపై న్యాయ సలహా తీసుకోవడంతో కొంద జాప్యం నెలకొంది. ఎట్టకేలకు ఈ బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేయడంతో.. అధికార పార్టీలో ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది.

మరోపక్క, రాజధాని వ్యవహారానికి సంబంధించి పలు కేసులు న్యాయస్థానాల్లో విచారణ దశలో వున్నాయి. ‘గవర్నర్‌ ఆమోదం పొందినా, న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం వుంది..’ అని అమరావతి రైతులతోపాటు, టీడీపీ నేతలు చెబుతున్నారు. ‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ విషయంలో గవర్నర్‌ జారీ చేసిన ఆర్డినెన్స్‌ని న్యాయస్థానం కొట్టిపారేసింది..’ అనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు టీడీపీ నేతలు. ఇక, ఇప్పుడు ఈ మూడు రాజధానుల విషయంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి.? న్యాయ సమీక్ష జరిగితే.. ప్రభుత్వానికి మళ్ళీ చుక్కెదురు తప్పదా.? వేచి చూడాల్సిందే.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...