ఓపక్క దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా బెంగళూరులో మాత్రం పరిస్థితులు అదుపులోకి రావట్లేదు. ఫస్ట్ వేవ్ లో కరోనా కట్టడిలో ముందున్న బెంగళూరు.. రెండో వేవ్ లో చిగురుటాకులా వణుకుతోంది. కోవిడ్ తీవ్రతలో ఢిల్లీ, ముంబైతో పోలిస్తే బెంగళూరులో నమోదవుతున్న కేసుల సంఖ్య కలవరపెడుతోంది. ఢిల్లీలో 24, 667, బెంగళూరు 15,118 కోవిడ్ మరణాలు సంభవించాయి. బెంగళూరులో ఒక రోజులో 2022 కోవిడ్ కేసులు, 44 మరణాలు నమోదైతే.. ముంబైలో కొత్త కేసులు 682 నమోదయ్యాయి.
ప్రస్తుతం ముంబైలో 15,786 కోవిడ్ కేసులుంటే.. బెంగళూరులో 1,01,965 కేసులు ఉండటం వైద్య వర్గాలను కలవరపెడుతోంది. ముంబై ఇలా క్రమంగా కరోనా తీవ్రతలో తగ్గుముఖం పట్టేందుకు అక్కడ తీసుకున్న పకడ్బందీ చర్యలే కారణం. అయితే.. బెంగళూరులో కరోనా కేసుల స్థాయిలోనే మరణాలు సంభవించడం ఎవరికీ అంతుపట్టడం లేదు. నగరంలోని 14 స్మశానాలు చాలక నగరం వెలుపల 230 ఎకరాల స్థలాన్ని కరోనా మృతదేహాల అంత్యక్రియలకు కేటాయించారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
519054 987860Hello there. I necessary to inquire some thingis this a wordpress internet site as we are thinking about transferring across to WP. Moreover did you make this theme all by yourself? Cheers. 556659