బాలకృష్ణ గత ఏడాది ఆరంభంలో ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్ట్లు కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. వంద కోట్ల సినిమా అంటూ ప్రచారం చేస్తే ఆ సినిమాలు కనీసం పాతిక కోట్లు కూడా వసూళ్లు చేయలేక పోయాయి. తప్పు ఎక్కడ జరిగిందో ఏ ఒక్కరు కూడా చెప్పలేక పోయారు. రివ్యూలు పాజిటివ్గానే వచ్చినా కూడా వసూళ్లు మాత్రం డిజాస్టర్గా వచ్చాయి. తన తండ్రి బయోపిక్ను భారీ బడ్జెట్తో బాలయ్య నిర్మించిన విషయం తెల్సిందే. ఆ సినిమా తీవ్రంగా నిరాశ పర్చిన నేపథ్యంలో మళ్లీ ఎన్టీఆర్ పాత్ర అంటేనే బాలయ్య భయపడుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ దర్శకత్వంలో కంగనా రనౌత్ హీరోయిన్గా రూపొందుతున్న ‘తలైవి’ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర కోసం బాలకృష్ణను నటింపజేయాలనుకున్నారట. అందుకోసం వారం లేదా పది రోజులు డేట్లు కావాలని అడిగారట. కాని బాలయ్య మాత్రం పాత్ర ఎంత ఉంది, ఎప్పుడు షూటింగ్ అనే విషయాలు కూడా కనుక్కోకుండా సారీ బాబోయ్ అంటూ తప్పుకున్నాడట. ప్రస్తుతం తలైవిలో ఎన్టీఆర్ పాత్ర కోసం మరో నటుడిని సంప్రదిస్తున్నారట.
ఈ బయోపిక్లో జయలలిత పాత్రను కంగనా రనౌత్ చేస్తుండగా కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, అరవింద్ స్వామిలు నటిస్తున్నారు. పలువురు స్టార్స్ను ఈ చిత్రంలో నటించబోతున్నారని చెబుతున్నారు. ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయాలని భావించారు. అయితే కరోనా ఎఫెక్ట్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయింది. లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే తలైవి చిత్రం షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన తలైవి ఫస్ట్లుక్తో కంగనా మెప్పించిన విషయం తెల్సిందే.
112104 537813I really like meeting utile information, this post has got me even far more information! . 541244