యవజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై నమోదైన రాజద్రోహం కేసు వ్యవహారానికి సంబంధించి ఆయన గతంలోనే బెయిల్ పొందారు. అయితే, బెయిల్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడంలో చిన్నపాటి సాంకేతిక సమస్య కారణంగా ఏపీ సీఐడీ, ఆయన్ని ఎలాగైనా గుంటూరుకి రప్పించేందుకోసం ప్రయత్నిస్తోందట.
సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగానే, ఆయన నేరుగా ఢిల్లీకి వెళ్ళిపోయారు. అక్కడ ‘ఎయిమ్స్’లో చికిత్స పొందారు. పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలుస్తున్నారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే, బెయిల్ వ్యవహారానికి సంబంధించి పూచీకత్తులు సమర్పించడంతోపాటుగా, స్వయంగా రఘురామ సంతకాలు చేయాల్సి వుందనీ, రఘురామ సంతకాలు చేయలేదనీ, దాంతో, బెయిల్ షరతుల్ని రఘురామ ఉల్లంఘించినట్లేనని అధికార వైసీపీ చెబుతోంది. ‘ఇంకోసారి రప్పించి.. మళ్ళీ కుళ్ళబొడిచేయడం తప్పదు..’ అంటూ సోషల్ మీడియాలో వైసీపీ మద్దతుదారుల నుంచి అత్యుత్సాహంతో కూడిన పోస్టింగులు కనిపిస్తుండడం గమనార్హమిక్కడ.
ఇదిలా వుంటే, సాంకేతికంగా కొన్ని వ్యవహారాలు పూర్తి కాకపోవడంతో, రఘురామ రిమాండుని సీఐడీ కోర్టు పొడిగించడం గమనార్హం. దాంతో, ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు. మరి, రఘురామ.. ఢిల్లీ నుంచి వచ్చి గుంటూరు సీఐడీ కోర్టుకు హాజరవ్వాల్సిందేనా.? లేదంటే, రఘురామ తరఫు న్యాయవాదులు ఆ వ్యవహారాల్ని చక్కబెట్టేస్తారా.? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి వుంది.
మరోపక్క, ఏ అవకాశం దొరుకుతుందా.? అని ఎదురుచూసిన ఏపీ సీఐడీ అత్యంత వ్యూహాత్మకంగా రఘురామని ఇరుకున పెడుతోందన్న వాదనలూ లేకపోలేదు. కానీ, వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో వుంది గనుక, సీఐడీ నుంచి పొరపాట్లకు ఆస్కారం వుండకపోవచ్చు. ఇదిలా వుంటే, రఘురామ లేఖాస్త్రాలు.. సుప్రీం షరతుల్ని ఉల్లంఘించేలా వున్నాయన్న వాదన అధికార వైసీపీ నుంచి వినిపిస్తోంది.
62611 38255Hey, are you having issues with your hosting? I required to refresh the page about million times to get the page to load. Just saying 365839
282032 171292I discovered your weblog site on google and appearance a few of your early posts. Maintain up the excellent operate. I simply extra the RSS feed to my MSN News Reader. Searching for forward to reading more on your part later on! 953816