ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘అవతార్’. ఈనెల 16న విడుదలకు సిద్ధమవుతున్న అవతార్ అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ లో సంచలనాలు నమోదు చేస్తోంది. దాదాపు 13ఏళ్ల క్రితం విడుదలైన అవతార్ సినిమాకు సీక్వెల్ గా అవతార్-2.. ది వే ఆఫ్ వాటర్ గా సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన బుకింగ్స్ లో టికెట్లు భారీగా అమ్ముడుపోతున్నాయి.
మొదటి రోజే 2లక్షల టికెట్లు అమ్ముడుపోగా.. వీకెండ్ కి 4.10లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. రిలీజ్ సమయానికి ఈ సంఖ్య 5లక్షలు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. లక్షకు పైగా టికెట్లు పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్ లోనే అమ్ముడుపోవడం గమనార్హం. ఇప్పటికి వసూలైన గ్రాస్ రూ.16కోట్లకు చేరడం విశేషం. ప్రీసేల్ బుకింగ్స్ 60కోట్లకు పైగానే రావొచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో అవతార్ మొదటి భాగం పండోరా గ్రహం (ఊహాజనితం)లో తీస్తే.. సీక్వెల్ సముద్ర గర్భంలో తెరకెక్కించారు.
504387 635845I also recommend HubPages itself, and Squidoo, which is similar. 279652
229849 987478I genuinely enjoy seeking at on this web site , it has amazing content material . 285723