టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క వచ్చే నెలలో బిడ్డకు జన్మనివ్వబోతన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ తన ఆస్ట్రేలియా పర్యటనను అర్థాంతరంగా ముగించి ఇండియాకు చేరుకోబోతున్నాడు. టెస్టు సిరీస్ లో మొదటి టెస్టు ప్రస్తుతం జరుగుతోంది. ఈ టెస్టు పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే కోహ్లీ ఇండియాకు చేరుకుంటాడు. అయితే కోహ్లీ లేని టెస్టు సిరీస్ బోరింగ్ గా సాగుతుందని ఇండియన్ ప్రేక్షకులు మరియు ఆస్ట్రేలియన్ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే విరుష్క దంపతులు తమ బిడ్డకు ఆస్ట్రేలియాలో జన్మనివ్వాలని కోరుతున్నారు.
ఇదే విషయాన్ని తాజాగా ఆస్ట్రేలియా స్టార్ పేసర్ బ్రెట్ లీ అన్నాడు. మీకు పుట్టబోతున్న బిడ్డకు ఇక్కడే జన్మనివ్వండి. అప్పుడు అన్ని విధాలుగా బాగుంటుందని కోహ్లీని ఆస్ట్రేలియా పర్యటన కొనసాగించాలంటూ బ్రెట్ లీ ఇండైరెక్ట్ గా అన్నాడు. మొదటి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సమయంలో ఆయన మంచి పామ్ లో ఉన్నాడు. కనుక ఆయన ఆట కొనసాగించాలనేది చాలా మంది అభిప్రాయం. కాని ఇప్పటికే కోహ్లీ ఇండియాకు వచ్చేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి. ఆయనకు బీసీసీఐ నుండి కూడా అనుమతి ఉన్న విషయం తెల్సిందే.