మాజీ మంత్రి పేర్ని నాని.! అయ్ బాబోయ్.! ఈయన్ని కూడా మాజీ మంత్రి అనకూడదేమో.! పోనీ, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని అంటే ఓకేనా.? ఈయనగారికి తెలంగాణ మీద, తెలంగాణలో సమస్యల మీదా లెక్చర్ దంచెయ్యాలని ఎందుకు అనిపించిందో.?
వున్నమాట అంటే ఉలుకెక్కువ.. అన్నట్టు, ఏపీలో రోడ్ల దుస్థితి, కరెంటు సమస్యలు, నీటి సమస్యల విషయమై తెలంగాణ మంత్రి కేటీయార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తే, వైసీపీ నేతలకు ఒళ్ళు మండిపోయింది. ‘గుంపుగా’ వచ్చి పడిపోయారు తెలంగాణ మంత్రి మీద విమర్శలు చేయడానికి.
తమ తమ నియోజకవర్గాల్లో రోడ్లెలా వున్నాయో ఒక్క వైసీపీ నేతకీ తెలియదుగానీ, ‘తెలంగాణలో రోడ్లెలా వున్నాయో చూసుకోండి..’ అంటూ సెటైర్లేసేశారు. అందరికన్నా పెద్ద కామెడీ చేసింది పేర్ని నాని. కోవిడ్ సమయంలో తెలంగాణ నుంచి లక్షలాది మంది బతుకు జీవుడా.. అంటూ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారట.. అక్కడ వైద్య చికిత్స పొంది హమ్మయ్య.. అంటూ ప్రాణాలు నిలుపుకున్నారట. అలాగని సెలవిచ్చారు పేర్ని నాని.
అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి పేర్ని నాని ఏమనుకుంటున్నారు.? తాము ఏం చెప్పినా ప్రజలు గుడ్డిగా నమ్మేస్తారనే భావనలో ఆయన వున్నట్టున్నారు. లేకపోతే, వైసీపీకి చెందిన చాలామంది నేతలు.. మంత్రులు సహా, కోవిడ్ సోకగానే తెలంగాణకు పారిపోయిన వైనాన్ని ప్రపంచమంతా చూసింది.
మొన్నటికి మొన్న ఏపీ గవర్నర్ తీవ్ర అస్వస్థతకు లోనైతే ఆయన కూడా తెలంగాణలోనే వైద్య చికిత్స పొందారు. ఫాలో అప్ ట్రీట్మెంట్ కూడా ఆయన తెలంగాణలోనే తీసుకోవాల్సి వచ్చింది. ఏపీని వైద్యం పరంగా ఉద్ధరించేస్తున్నామని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం, తమ నేతలకే ఏపీలో వైద్య చికిత్స ఇప్పించలేకపోతోందాయె.!
అన్నిటికన్నా ముఖ్యమైన విషయం తెలంగాణకు హైద్రాబాద్ రూపంలో విశ్వనగరం లాంటి రాజధాని వుంది. మరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి.? వున్న రాజధాని అమరావతి మీద ‘కమ్మరావతి’ ముద్ర వేసేసి, రాజధాని నిర్మాణ పనుల్ని ఆపేయించింది వైఎస్ జగన్ సర్కారు. పేర్ని నానికి ఇవన్నీ తెలియవా.? తెలియక కాదు, తెలిసీ.. జనాన్ని మభ్యపెట్టడం ఆయనకు మంత్రిగా వున్నప్పుడే అలవాటైపోయింది.. మంత్రి పదవి పోయినా, అది మాత్రం తగ్గడంలేదాయె.!