దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా బారిన పడి దాని నుండి కోలుకున్నా తీవ్ర అనారోగ్య కారణాల వల్ల దాదాపు నెల రోజులు మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు విడిచారు. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన ఆయన 50 ఏళ్లగా శ్రోతలను అలరిస్తూ వస్తున్నారు.
ఆయన పాటలు మరో 50 ఏళ్ల పాటు కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాయి. అందుకే ఆయన ఖ్యాతి భారతదేశమే గర్వించదగ్గది అంటూ అభిమానులు అంటున్నారు. ఆయన మృతి చెందిన సమయంలో అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఆయనకు భారతరత్న ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు.
నేడు ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం తరపున నుండి బాలు గారికి భారతరత్న ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. లేఖలో బాలు గారి ఘనతలు చెప్పడంతో పాటు ఆయన దక్కించుకున్న అభిమానగణంను కూడా జగన్ పేర్కొన్నారు. భారతరత్నకు పూర్తి అర్హుడు అయిన ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలంటూ కోరారు. ఎస్పీ బాల సుబ్రమణ్యం ను సత్కరించుకోవడం ప్రతి ఒక్కరికి గౌరవంగా ఉంటుందని ఆనందాన్ని కలిగిస్తుందంటూ సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు.
941437 369863I feel your suggestion would be helpful for me. I will let you know if its work for me too. Thank you for sharing this beautiful articles. thanks a whole lot 297995