భాగమతి సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న జేజమ్మ అనుష్క తన నెక్స్ట్ సినిమాను ఈ రోజు అమెరికాలో మొదలు పెట్టింది. గత కొన్నీ రోజులుగా ఈ సినిమా కోసం హార్డ్ వర్క్ చేసిన అనుష్క బరువు కూడా బాగా తగ్గింది. కోన ఫిలిం మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సైలెంట్ అనే టైటిల్ ఖరారు చేసారు. తెలుగు, ఇంగ్లీష్, తమిళ భాషలో ఇది తెరకెక్కుతోందని తెలుగు టైటిల్ గా నిశ్శబ్దం అనే టైటిల్ ని ఫిక్స్ చేయగా ఇంగ్లీష్ వెర్షన్ కోసం సైలెంట్ అనే టైటిల్ ని ఖరారు చేస్తున్నట్టు యూనిట్ తెలిపింది.
అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తుండగా తెలుగు హీరోయిన్ అంజలి కూడా ఇందులో మరో కీ రోల్ పోషిస్తుంది. మాధవన్, షాలిని పాండే తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ ఇస్తున్నాడు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాను త్వరగానే పూర్తీ చేస్తారట. అరుంధతి, బాహుబలి, భాగమతి లాంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన అనుష్క తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైరా లో కూడా ఓ గెస్ట్ లో కనిపిస్తుందట.
అనుష్క సైజ్ జీరో సినిమా సమయంలో లావు పెరగడం వల్ల చాలా సమస్యలు తలెత్తాయి. అనుష్క లావుగా ఉండడంతో ఆమెకు అవకాశాలు బాగా తగ్గాయి. దాంతో భాగమతి సినిమా తరువాత కావాలని గ్యాప్ తీసుకుని స్లిమ్ అయ్యే పనిలో సీరియస్ గా పడింది. ప్రస్తుతం ఆమె 15 కిలోల వరకు తగ్గి మళ్ళీ పాత గ్లామర్ కు వచ్చేసిందని అంటున్నారు.
940369 463068Yeah bookmaking this wasnt a speculative decision outstanding post! . 487606
607068 153609Spot on with this write-up, I truly believe this internet site needs significantly more consideration. Ill probably be once again to read considerably far more, thanks for that info. 533808
164681 623312Yeah bookmaking this wasnt a high risk determination outstanding post! . 172789