కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నం నేపథ్యంలో దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోతుంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వంకు చేయూత ఇచ్చే ఉద్దేశ్యంతో ఉడతా భక్తిగా సెలబ్రెటీలు వ్యాపారవేత్తలు తమవంతు సాయం అన్నట్లుగా విరాళాలను ప్రకటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో మంచి మనసుతో ఏకంగా 250 కోట్ల రూపాయల విరాళంను ప్రకటించాడు అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో హల్ చల్ చేస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీని అమీర్ కలిసి ఆ విరాళం ఇచ్చినట్లుగా ఆ వీడియోలో చూపిస్తున్నారు. దాంతో ఆయన అభిమానులు ఇంకా ఇతరులు అంతా కూడా అబ్బా అమీర్ ఎంత గొప్ప వాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ఆయన విరాళం ఇచ్చిన మాట నిజం కాదని అంటున్నారు. అమీర్ ఖాన్ ప్రధాని నరేంద్ర మోడీని కలిసినట్లుగా చూపిస్తున్న వీడియో ఇప్పటిది కాదని అయిదు సంవత్సరాల క్రితంది అంటా.
జాతీయ స్థాయిలో అమీర్ ఖాన్ భారీ విరాళం గురించి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన్ను ప్రముఖ జర్నలిస్ట్ ఒకరు సంప్రదించేందుకు ప్రయత్నించారట. ఆ సమయంలో అమీర్ ఖాన్ మేనేజర్ నుండి ఈ విషయమై క్లారిటీ వచ్చింది.
ఇప్పటి వరకు అమీర్ కరోనా కోసం ఎలాంటి విరాళం ఇవ్వలేదని, తప్పకుండా కరోనా విపత్తుకు తనవంతు సాయం చేసేందుకు అమీర్ సిద్దంగా ఉన్నాడని మేనేజర్ అన్నాడట. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఇలాంటి పుకార్లు దారుణం. జనాలు ఇంకా ఎప్పుడు మారుతారో ఏమో..!
665934 541973I saw your post awhile back and saved it to my computer. Only recently have I got a chance to checking it and need to tell you nice work. 619762
460254 707126Fantastic blog here! Also your internet site loads up rapidly! What host are you using? Can I get your affiliate link to your host? I wish my web site loaded up as quick as yours lol 140714
491075 612900 You made some decent points there. I looked on the internet for the problem and identified most individuals will go along with along with your website. 952816