దేశం మొత్తం కరోనాతో సతమతమవుతున్న తరుణంలో పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలు తమ వంతుగా ప్రభుత్వాలకు విరాళాలు ఇస్తున్నారు. ఎవరి స్థాయికి తగిన మొత్తాన్ని ప్రధాని సహాయనిధికో లేక సీఎం సహాయనిధికో ప్రకటిస్తున్నారు. ఈ తరుణంలో ప్రముఖ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని కరోనా బాధితుల కోసం రూ.లక్ష ఇచ్చారన్న వార్త కల్లోలం సృష్టించింది.
రూ.800 కోట్ల ఆస్తిపరుడివి.. ముష్టి వేసినట్టుగా రూ.లక్ష ఇస్తావా అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేశారు. ఎవరు ఎంతగా విమర్శలు చేసినా ఎప్పటిలాగానే ధోని కూల్ గానే ఉన్నాడు. ఏమీ స్పందించలేదు. దీంతో ఆయన భార్య సాక్షి తెరపైకి వచ్చారు. మీడియాపై తిట్ల వర్షం కురిపించారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ఇలాంటి అబద్ధపు రాతలు రాయడానికి బుద్ధిలేదా అని ప్రశ్నించారు. మీడియాను చూసి సిగ్గుపడుతున్నానని, నిజమైన జర్నలిజం మాయమైపోయినందుకు బాధగా ఉందని పేర్కొన్నారు. కానీ ఆమె కూడా నిజమేమిటనేది చెప్పలేదు.
ఇంతకీ కోటీశ్వరుడైన ధోని కరోనా బాధితుల కోసం ఇచ్చింది లక్షేనా అనే అనుమానం ఆయన అభిమానుల్లో కూడా ఉండిపోయింది. అయితే, వాస్తవానికి ధోని ఇచ్చిన విరాళం రూ.లక్షే. కానీ అది కరోనా బాధితుల కోసం అందరూ చేసినట్టుగా ఆయన చేయలేదు. ఓ ఛారిటీ కార్యక్రమం కోసం కెట్టో అనే క్రౌడ్ ఫండింగ్ వెబ్ సైట్ విరాళాలు సేకరిస్తోంది. ఆ కార్యక్రమానికి రూ.12.5 లక్షలు అవసరం కాగా, ధోని తన వంతుగా రూ.లక్ష ఇచ్చాడు. ఇదీ వాస్తవం.
అయితే, ఎవరో పొరబడి అది కరోనా బాధితుల కోసం ధోని ఇచ్చిన విరాళంగా భావించడంతో ట్రోలింగ్ కు గురికావాల్సి వచ్చింది. కాగా, ఇప్పటికే బీసీసీఐతోపాటు పలువురు క్రికెటర్లు కూడా పీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటించగా.. ధోని మాత్రం ఇంకా ఏమీ ఇవ్వలేదు.
356697 609523Great beat ! I wish to apprentice while you amend your web internet site, how can i subscribe for a weblog internet site? The account aided me a appropriate deal. I had been a little bit acquainted of this your broadcast provided bright clear idea 460363
734970 221532You produced some initial rate factors there. I seemed on the internet for the difficulty and located many people will go along with together with your internet site. 247432
533159 740780Some genuinely quality blog posts on this internet site, saved to fav. 670856